తాగునీటి కుళాయిల నుంచి కలుషిత నీరు రావడంపై విజయనగరం జిల్లా పార్వతీపురం టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.
తాగునీటి కుళాయిల నుంచి కలుషిత నీరు రావడంపై స్థానిక టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా పార్వతీపురం మున్సిపాలటీ పరిధిలోని కలుషిత నీటితో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారంటూ మున్సిపల్ వైస్ చైర్మన్ జయప్రకాష్, మరో 14 మంది టీడీపీ కౌన్సెలర్లతో కలసి నిరసన వ్యక్తంచేశారు. పార్వతీపురం మున్సిపల్ చైర్మన్కూడా టీడీపీకి చెందిన వారే. అయినప్పటికీ టీడీపీలోని మరో వర్గం నిరసన వ్యక్తం చేయడం విశేషం.