అనంతపురం : ఎట్టకేలకు అవినీతి అక్రమాల ఆరోపణలు ఎదుర్కొంటున్న పీటీసీ డీఎస్పీ ఏ. హనుమంతుపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు డీజీపీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ బిల్డింగ్ నిర్మాణంలో కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు దండుకోవడం, ఉద్యోగులను వేధింపులు, అక్రమంగా హెచ్ఆర్ఏ నిధులు డ్రా చేయడం, ప్రభుత్వ వాహనాన్ని అనధికారికంగా ప్రైవేటుకు వినియోగించుకున్నట్లు తేలడంతో సస్పెన్షన్ వేటు పడింది. వివరాల్లోకి వెళ్తే...పీటీసీలో జరుగుతున్న నిర్మాణ పనుల్లో కమీషన్ ఇవ్వలేదనే కారణంతో డీఎస్పీ హనుమంతు నిర్మాణ పనులు ఆపించారని కాంట్రాక్టర్ షౌకత్ అలీఖాన్ గతంలో ఆరోపించారు.
ఇదే విషయమై చివరకు టూటౌన్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. పీటీసీలో క్వాటర్స్ను సబ్ కాంట్రాక్ట్ తీసుకున్న తనను డీఎస్పీ హనుమంతు ఇబ్బందులకు గురి చేశాడని, చివరకు రూ. 25 వేలు కమీషన్ రూపంలో ఇచ్చానని తెలిపాడు. రోజూ పని వద్దకు వచ్చి మిగిలిన కమీషన్ ఇస్తేనే పని చేయాలని, లేదంటే పనులు చేయొద్దని ఒత్తిడి చేస్తుండడంతో కొద్దిరోజు పనులు కూడా ఆపేశామని అప్పట్లో ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.
దీనికి తోడు పీటీసీలో బిగ్లర్ హెడ్కానిస్టేబుల్గా పని చేస్తున్న ఎస్. ఇరుదయరాజ్ వెల్ఫేర్ స్టోరు హెల్పర్గా ఉంటున్నారు. డీఎస్పీ హనుమంతు వేధింపులు తాళలేక ఈయన కూడా గతంలో టూటౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ‘స్టోర్లో నీవెంత సంపాదించావు? నాకు రూ. లక్ష ఇవ్వాలి’ అని డిమాండ్ చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. స్టోర్ ద్వారా ఎలాంటి అక్రమ సంపాదన చేయలేదని తెలిపితే ‘ నీ ఇష్టం. ఇవ్వకపోతే నీపై కేసు రాసి జైలుకు పంపుతా’నని బెదిరించాడని.. దీంతో భయపడి రూ. 45 వేలు డీఎస్పీకి ఇచ్చానని బాధితుడు ఆరోపించాడు. అంతటితో ఆగకుండా తక్కిన రూ. 55 వేలు కూడా ఇవ్వాలటూ గడువు విధించాడు. ఈ క్రమంలో తనను ఇబ్బందులకు గురి చేసిన డీఎస్పీపై చర్యలు తీసుకోవాలని ఇరుదయరాజ్ ఫిర్యాదు చేయడం అప్పట్లో కలకలం రేపింది.
వీటన్నింటికీ తోడు హనుమంతు ప్రభుత్వ క్వాటర్సులోనే ఉంటూ హెచ్ఆర్ఏ డ్రా చేయడం, తన వ్యక్తిగత పనులకు ప్రభుత్వ వాహనం ఉపయోగించడం తదితర ఫిర్యాదులపై ఉన్నతాధికారులు సమగ్రంగా విచారణ చేయించారు. డీఎస్పీ హనుమంతు లీలలు నిగ్గు తేలడంతో చివరకు సస్పెన్షన్ వేటు వేశారు. కాగా...తనను డీఎస్పీ హనుమంతు డబ్బులు డిమాండ్ చేస్తున్నాడంటూ ఫిర్యాదు చేసిన హెడ్కానిస్టేబుల్ ఇరుదయరాజ్ను ఇదివరకే సస్పెన్షన్ చేయడం కొసమెరుపు.
వేటు పడింది!
Published Wed, Feb 25 2015 2:38 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
స్వల్పంగా పెరిగిన పసిడి.. అదే బాటలో వెండి
అమెరికన్ల ఇంటి పేర్లు ఎలా ఉంటాయో తెలుసా..!
ఆస్ట్రేలియాలో కత్తిపోట్లకు బలైన భారతీయ విద్యార్థి..భూమి అమ్మి పైచదువులకు
కూతురితో కలిసి ప్రముఖ ఆలయాన్ని సందర్శించిన స్టార్ హీరోయిన్!
పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా
పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల
పొన్నూరు లో పవన్ సభ అట్టర్ ఫ్లాప్ అంబటి మురళీకృష్ణ సెటైర్లు
16 ఏళ్లకే గర్భం ఆపై భర్త మోసం.. ఇప్పుడు స్టార్ హీరోకు అత్తగా..
చంద్రబాబు, కొడుకు పప్పు తుప్పు.. అనిల్ కుమార్ యాదవ్ స్పీచ్ కి దద్దరిల్లిన మాచెర్ల
తప్పక చదవండి
- ఆస్ట్రేలియాలో కత్తిపోట్లకు బలైన భారతీయ విద్యార్థి..భూమి అమ్మి పైచదువులకు
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- అచ్చా.. అలాగా?: కోహ్లిపై గావస్కర్ కామెంట్స్.. ఫ్యాన్స్ ఫైర్
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- AP Elections 2024: చివరి నాలుగు రోజులే!
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement