సుప్రీంలో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు | Supreme Court Rejects AP Petition On Krishna Water | Sakshi
Sakshi News home page

సుప్రీంలో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు

Dec 10 2018 12:15 PM | Updated on Dec 10 2018 8:10 PM

Supreme Court Rejects AP Petition On Krishna Water - Sakshi

సాక్షి, ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. కృష్ణా ట్రిబ్యునల్‌ నదీపరివాహం గల నాలుగు రాష్ట్రాల వాదనలు వినాలని సుప్రీంకోర్టులో ఇటీవల ఏపీ ప్రభుత్వం పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై సోమవారం విచారణ జరిపిన ధర్మాసనం పిటిషన్‌ను తోసిపుచ్చింది. నాలుగు రాష్ట్రాలు కాకుండా తెలుగు రాష్ట్రాల వాదనలు సరిపోతాయన్న ట్రిబ్యునల్‌ తీర్పును న్యాయస్థానం సమర్థించింది.

గతంలో ఇదే తరహాలో తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది. తెలంగాణ ప్రభుత్వ పిటిషన్‌పై ఇచ్చిన తీర్పునే సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. కోర్టు నిర్ణయంతో కృష్ణా జలాలపై తెలుగు రాష్ట్రాల మధ్య వాదనలు యధావిధిగా కొనసాగనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement