సమైక్యాంధ్ర కోసం జిల్లా కోర్టులో న్యాయవాదుల సంఘం సభ్యులు, న్యాయశాఖ ఉద్యోగులు చేస్తున్న రిలే దీక్షలకు బుధవారం నెల్లూరు నగర, రూరల్ నియోజకవర్గాల సమన్వయకర్తలు డాక్టర్ పి.అనిల్కుమార్, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి సంఘీభావం తెలిపారు.
సాక్షి, నెల్లూరు: సమైక్యాంధ్ర కోసం జిల్లా కోర్టులో న్యాయవాదుల సంఘం సభ్యులు, న్యాయశాఖ ఉద్యోగులు చేస్తున్న రిలే దీక్షలకు బుధవారం నెల్లూరు నగర, రూరల్ నియోజకవర్గాల సమన్వయకర్తలు డాక్టర్ పి.అనిల్కుమార్, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారిద్దరూ మాట్లాడుతూ తెలుగు జాతి అంతా ఒకటిగా ఉండాలన్న కాంక్షతో ప్రతి ఒక్కరూ రోడ్లమీదకు వచ్చి అనేకరకాలుగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారన్నారు. అయినా కాంగ్రెస్ అధిష్టానంలో మాత్రం చలనం లేదని విమర్శించారు. తెలంగాణలో పెట్టుబడిదారుల ప్రోద్బలంతో ఉద్యమం జరిగిందన్నారు.
సీమాంధ్రలో మాత్రం విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలు స్వచ్ఛందంగా రోడ్ల మీదకు వచ్చి ఉద్యమిస్తున్నారన్నారు. ప్రపంచంలో ఎన్నో దేశాల్లో, ఎన్నో రాష్ట్రాల్లో విడిపోయేందుకు ఉద్యమాలు సాగాయని, మన రాష్ట్రంలో సీమాంధ్రలో సమైక్యంగా ఉంటామని ఆందోళనలు జరగడం ఉద్యమ ఖ్యాతి ఈ ప్రాంతానికే దక్కుతుందన్నారు. ఎంతో కాలంగా ప్రజలందరితో పాటు ఎందరో ముఖ్యమంత్రులు హైదరాబాద్ను అభివృద్ధి చేశారన్నారు. హైదరాబాద్కు కొన్ని వేల రెవెన్యూ వస్తుంటే రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేయడంపై ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమైతే ఇచ్ఛాపురం నుంచి తడ వరకు సీమాంధ్రులు మంచి నీటి కోసం అల్లాడే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. సమైక్యాంధ్ర కోసం న్యాయవాదులు చేసే ఏ దీక్షకైనా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుందని తెలిపారు. న్యాయశాఖ ఉద్యోగులు ఎస్ చక్రవర్తి, శివకుమార్, కె. నర్సింహులు, ఆర్. మాల్యాద్రి, పీవీ నర్సింహులురెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లోకిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, సంక్రాంతి కల్యాణ్, ముప్పసాని శ్రీనివాసులు, ఎ.బాలకోటేశ్వరావు, ఎస్కే సుభాన్, గంధం సుధీర్బాబు, న్యాయవాదులు పాల్గొన్నారు.