
విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ........
మునగాల మండలం మాధవరం, రేపాల, కలకోవ, కోదాడ మండలం తొగర్రాయిలోని పాఠశాలల్లో శనివారం స్వపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు
విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ........
మునగాల మండలం మాధవరం, రేపాల, కలకోవ, కోదాడ మండలం తొగర్రాయిలోని పాఠశాలల్లో శనివారం విద్యార్థులు స్వపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. మాధవరం ప్రాథమికోన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో సర్పంచ్ మేడం కాశయ్య, ప్రధానోపాయధ్యాయుడు ఎలక మాధవరెడ్డి, ఎస్ఎంసీ చైర్మన్ షేక్ సైదా, ఉపాధ్యాయులు తొగరు శ్రీనివాస్, దేవయాని, రేపాల ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు సీహెచ్.లింగారెడ్డి, వై.శ్రీని వాసరావు, ఎస్ఎంసీ చైర్మన్ పానుగోటి రంగా, ఉపాధ్యాయులు ఎన్.కల్పన, ఎస్.స్వరూప పాల్గొన్నారు. కలకోవలో డీఈఓగా ఎం.శ్రీలత, విద్యాశాఖ మంత్రిగా పనస మమత, ఎస్ఎంసీ చైర్మన్గా యమున, ప్రధానోపాధ్యాయురాలిగా జి.సుమతి వ్యవహరించారుఉ. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పోటు సీతారామయ్య, ఉపాధ్యాయులు డి.శ్రీను, జ్యోతి, కె.ఉమామహేశ్వరరావు, ఎల్.ఆనంద్కిశోర్, ఎం.రవికుమార్, ఎల్.వెంకటేశ్వర్లు, శంకర్, శ్రీధర్, సత్యనారాయణలు పాల్గొన్నారు. తొగర్రాయిలో నాగరాణి, సాంబశివరావు, నరసింహారావు, శ్రీనివాస్, వెంకటేశ్వరరావు, సుధాకర్రావు, నాగమణి, అండాళమ్మ, దశరథ, గంగా పాల్గొన్నారు. - న్యూస్లైన్, మునగాల/కోదాడ రూరల్