పరీక్షల్లో ఫెయిలవడంతో విద్యార్థిని ఆత్మహత్య | student committed suicide suicide | Sakshi
Sakshi News home page

పరీక్షల్లో ఫెయిలవడంతో విద్యార్థిని ఆత్మహత్య

Jun 17 2016 11:11 PM | Updated on Nov 9 2018 4:36 PM

పరీక్షల్లో ఫెయిలయ్యానని మనస్తాపానికి గురైన ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది.

యాడికి: పరీక్షల్లో ఫెయిలయ్యానని మనస్తాపానికి గురైన ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన అనంతపురం జిల్లాలోని యాడికి మండలం బోగాలకట్ట గ్రామంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వెంకటేశ్వరమ్మ(23) విజయవాడలోని ఓ ప్రైవేటు కళశాలలో ఎంబీఏ చదువుతోంది. సెమిస్టర్ పరీక్షలు పూర్తయ్యాక ఆమె గత కొన్ని రోజులుగా ఇంటి వద్దే ఉంటోంది. ఈ క్రమంలో పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. అందులో వెంకటేశ్వరమ్మ ఉత్తీర్ణత చెందకపోవడంతో మనస్తాపానికి గురైంది. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement