శ్రీకాకుళం ప్రజలు అప్రమత్తంగా ఉండాలి | Srikakulam people on alert due to heavy rains, says district collector | Sakshi
Sakshi News home page

శ్రీకాకుళం ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Oct 27 2013 2:52 PM | Updated on Sep 2 2018 4:46 PM

ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నాగావళి నది వరద పోటెత్తింది, ఈ నేపథ్యంలో ఆ నది పరివాహక ప్రాంతంలో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని జిల్లా కలెక్టర్ సౌరభ్ గౌర్ ఆదివారం తెలిపారు.

ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నాగావళి నది వరద పోటెత్తింది, ఈ నేపథ్యంలో ఆ నది పరివాహక ప్రాంతంలో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని జిల్లా కలెక్టర్ సౌరభ్ గౌర్ ఆదివారం తెలిపారు. జిల్లాలో 47 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. శ్రీకాకుళం పట్టణంలో ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు 30 సెంటీ మీటర్ల వర్షం కురిసిందని చెప్పారు. దాంతో శ్రీకాకుళం పట్టణవాసులు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. గడిచిన 24 గంటల కాలంలో 300 మి. మీ వర్షపాతం నమోదు అయిందని జిల్లా కలెక్టర్ వివరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement