భూమధ్య రేఖ దాటాక బలహీనపడ్డ రుతుపవనాలు
జూన్ 1కి కేరళకు.. విస్తరణలోనూ జాప్యం
సాక్షి, విశాఖపట్నం: నైరుతి రుతుపవనాల రాక ఆలస్యమవుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. గతంతో పోలిస్తే.. ఈసారి రుతుపవనాలు మూడు రోజుల ముందుగానే అండమాన్లో ప్రవేశించడంతో ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు మే 30 నాటికల్లా కేరళను తాకవచ్చని వాతావరణ విభాగం తొలుత అంచనా వేసింది. ఇప్పుడు పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. భూమధ్య రేఖను దాటాక రుతుపవనాలు బలహీనపడటంతో ప్రస్తుతం నైరుతి, తూర్పు మధ్య బంగాళాఖాతంలో నెమ్మదిగా కదులుతున్నాయి. ఇవి కేరళలో ప్రవేశించడానికి మూడు రోజులైనా పట్టవచ్చని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత అంచనాల ప్రకారం నైరుతి రుతుపవనాలు జూన్ ఒకటో తేదీకల్లా తాకే అవకాశం ఉందని చెబుతున్నారు.
వడదెబ్బతో రాష్ట్రంలో 90 మంది మృతి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎండల తీవ్రత ఇంకా కొనసాగుతూనే ఉంది. రామగుండంలో శుక్రవారం 47 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత న మోదైంది. నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో 45, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మంలలో 44, మహబూబ్నగర్లో 43.6, రంగారెడ్డిలో 43.1, హైదరాబాద్లో 43, మెదక్లో 42.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా, గత 24 గంటల్లో నాగర్కర్నూల్లో 3 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. కాగా, శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా వడదెబ్బకు 90 మంది మృత్యువాత పడ్డారు.
ఏపీలో 166 మంది..
ఏపీలో ఉష్ణోగ్రతలు తగ్గినప్పటికీ వడగాడ్పుల జోరు కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం వడదెబ్బతో 166 మంది మృత్యువాత పడ్డారు.
‘నైరుతి’ ఆలస్యం..!
Published Sat, May 30 2015 2:22 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement