ఐపీఎస్ బదిలీల్లో గందరగోళం నెలకొంది.
ఐపీఎస్ బదిలీల్లో గందరగోళం
Jun 30 2017 3:58 PM | Updated on Sep 5 2017 2:52 PM
అమరావతి: ఐపీఎస్ బదిలీల్లో గందరగోళం నెలకొంది. గుంటూరు, తిరుపతి అర్బన్ ఎస్పీల బదిలీల్లో మార్పులు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన ప్రభుత్వం. గుంటూరు అర్బన్ ఎస్పీగా అభిషేక్ మహంతిని, తిరుపతి అర్బన్ ఎస్పీగా విజయరావు చమటపల్లిని నియమిస్తూ పది రోజుల కిందట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా మహంతిని తిరుపతికి, విజయరావును గుంటూరు అర్బన్కు బదిలీ చేసింది. దీంతో ప్రభుత్వ తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
Advertisement
Advertisement