'27వ తేదీ అర్ధరాత్రి నుంచి ఒక్క బస్సు కూడా రోడ్డెక్కదు' | rtc union to strike from 27th january | Sakshi
Sakshi News home page

'27వ తేదీ అర్ధరాత్రి నుంచి ఒక్క బస్సు కూడా రోడ్డెక్కదు'

Jan 17 2014 5:56 PM | Updated on Sep 2 2017 2:43 AM

'27వ తేదీ అర్ధరాత్రి నుంచి ఒక్క బస్సు కూడా రోడ్డెక్కదు'

'27వ తేదీ అర్ధరాత్రి నుంచి ఒక్క బస్సు కూడా రోడ్డెక్కదు'

ఈ నెల 27వ తేదీ అర్ధరాత్రి నుంచి ఏ ఒక్క ఆర్టీసీ బస్సుకూడా రోడ్డెక్కదని కార్మిక సంఘాలు స్పష్టం చేశాయి.

హైదరాబాద్:ప్రగతిరథ చక్రాలు మళ్లీ నిలిచిపోనున్నాయి. ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టేందుకు సిద్ధమయ్యారు.ఈ నెల 27వ తేదీ అర్ధరాత్రి నుంచి ఏ ఒక్క ఆర్టీసీ బస్సుకూడా రోడ్డెక్కదని కార్మిక సంఘాలు స్పష్టం చేశాయి. కార్మికులకు రావాల్సిన మధ్యంతర భృతిపై ఆర్టీసీ యాజమాన్యం సరిగా స్పందించని కారణంగా తాము సమ్మెకు సమాయత్తమవుతున్నట్లు తెలిపాయి. శుక్రవారం ఆర్టీసీతో జరిగిన కార్మిక సంఘాల చర్చలు విఫలం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నాయి.

 

చర్చల అనంతరం ఈయూ, టీఎంయూ సంఘ నేతలు మీడియాతో మాట్లాడారు. కార్మికలకు వెంటనే 46 శాతం ఐఆర్ ప్రకటించాలన్నారు. కాని పక్షంలో సమ్మెను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement