ఆర్టీసీ బస్సు బోల్తా.. నలుగురికి గాయాలు


ఇబ్రహీంపట్నం రూరల్: కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలో ఆర్టీసీ బస్సు బోల్తా పడిన ఘటనలో నలుగురి ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. జగ్గయ్యపేట డిపోకు చెందిన ఆర్డినరీ బస్సు బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో జాతీయ రహదారిపై తుమ్మలపాలెం వద్ద అదుపుతప్పి ఓ చెట్టును ఢీకొట్టి బోల్తా పడింది. బస్సులో ఉన్న 17 మంది ప్రయాణికులకు పెద్ద ప్రమాదం తప్పింది. నలుగురు స్వల్పంగా గాయపడగా, మిగతవారు సురక్షితంగా బయటపడ్డారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top