రాజంపేట ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్‌లో దోపిడీ | Rs.50 lakh robbed from Andhra Pragathi Grameena Bank | Sakshi
Sakshi News home page

రాజంపేట ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్‌లో దోపిడీ

Sep 10 2013 9:10 AM | Updated on Sep 1 2017 10:36 PM

ఎస్ఆర్ జిల్లా రాజంపేట ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్‌లో దోపిడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

కడప:  వైఎస్ఆర్ జిల్లా  రాజంపేట ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్‌లో దోపిడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దుండగులు సుమారు రూ. 50 లక్షలు చోరీ చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. బ్యాంక్కు ఆదివారంతో పాటు.... వినాయకచవితి సందర్భంగా వరుసగా రెండు రోజులు సెలవులు రావటంతో చోరీ జరిగిన విషయాన్ని బ్యాంక్ సిబ్బంది ఈరోజు ఉదయం గమనించారు. అధికారుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement