రోషిణి కేరాఫ్‌ తూర్పుగది.. | Roshini Care Of Thurpu gadhi Movie Promotion | Sakshi
Sakshi News home page

రోషిణి కేరాఫ్‌ తూర్పుగది సినిమాకు ప్రేక్షకాదరణ

Jul 28 2018 1:08 PM | Updated on Jul 31 2018 1:34 PM

Roshini Care Of Thurpu gadhi Movie Promotion - Sakshi

విశాఖపట్నం ,మాడుగుల రూరల్‌ :మండలంలో కె.జె.పురం గ్రామానికి చెందిన శరగడం సోదరులు నిర్మించిన∙చలన చిత్రం రోషిణి కేరాఫ్‌  తూర్పుగది చలన చిత్రం శుక్రవారం విడుదలైంది కె.జె.పురం గ్రామానికి చెందిన శరగడం నాగునాయుడు కుమారులు గత పది సంవత్సరాలుగా హైదరాబాదులో చలనచిత్ర రంగంలో పనిచేస్తు, గతంలో ధడేల్, ఇద్దరం  చలనచిత్రాలు నిర్మించారు.

ఇప్పుడు తాజాగా తాము నిర్మించిన రోషిణి కేరాఫ్‌  తూర్పు గది చలనచిత్రం ప్రేక్షకాదరణకు నోచుకుంటోందని నిర్మాతలు తెలిపారు.  శరగడం శ్రీనివాసరావు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, శరగడం సుధీర్‌ నిర్మాతగా వ్యహరిస్తున్నారు. ఇది ప్రేమ కథాంశంతో పాటు హర్రర్‌ చలన చిత్రమని దర్శకుడు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement