ఆగిఉన్న లారీని ఢీకొట్టిన ప్రైవేటు అంబులెన్స్
తండ్రి, ఇద్దరు కుమారుల దుర్మరణం
అంబులెన్స్ డ్రైవర్కు తీవ్రగాయాలు
డ్రైవర్ నిద్రమత్తు మూడు నిండు ప్రాణాలను బలితీసుకుంది. అనారోగ్యంతో ఉన్న కొడుకును ప్రైవేటు అంబులెన్స్లో హైదరాబాద్ నుంచి ఒంగోలుకు తీసుకొస్తుండగా.. మార్గమధ్యంలో ఆగి ఉన్న లారీని అంబులెన్స్ ఢీకొట్టడంతో తండ్రితో సహా ఇద్దరు కుమారులు దుర్మరణం చెందారు. ఈ ఘటన మండలంలోని కొంగపాడు డొంక వద్ద మేదరమెట్ల-నార్కెట్పల్లి రాష్ట్రీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.
అద్దంకి,పొన్నలూరు మండలం పెద వెంకన్నపాలెం గ్రామానికి చెందిన కసుకుర్తి మాలకొండయ్య, రెండో కుమారుడు మధు హైదరాబాద్లో మోటారుబైక్ నడుపుతూ ప్రమాదానికి గురయ్యాడు. మధు కాళ్లు, చేతులు, తలకు బలమైన గాయాలయ్యాయి. ఈ క్రమంలో మధు తండ్రి మాలకొండయ్య, అన్న మాల్యాద్రిలు అతనికి హైదరాబాద్లోని రెమిడి వైద్యశాలలో చికిత్స చేయిస్తున్నారు. అయితే అక్కడ వైద్య ఖర్చులు భరించలేక.. ఒంగోలులో వైద్యం చేయించేందుకు సోమవారం రాత్రి 10 గంటల సమయంలో ప్రైవేటు అంబులెన్స్లో మధుని తీసుకొని ఒంగోలు బయలుదేరారు. అంబులెన్స్ వాహనం మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు అద్దంకి సమీపంలోని కొంగపాడు డొంక వద్దకు చేరుకోగానే డ్రైవర్ నల్గొండ జిల్లా పంపల్లికి చెందిన జే వెంకటేశ్వర్లు నిద్రలోకి జారుకున్నాడు.
అదే సమయంలో హైదరాబాద్ వెళ్తూ రోడ్డు మార్జిన్లో నిలిపి ఉన్న లోడ్ లారీని అంబులెన్స్ అదుపు తప్పి ఢీకొంది. ప్రమాదంలో అంబులెన్స్లో ఉన్న మధు తండ్రి మాలకొండయ్య (65), అన్న మాల్యాద్రి అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్ర గాయాలైన మధును, అంబులెన్స్ డ్రైవర్ వెంకటేశ్వర్లును లారీడ్రైవర్ సురేష్గౌడ్ అం దించిన సమాచారం మేరకు 108 వాహనంలో ఒంగోలు రిమ్స్కు తరలించారు. వైద్యశాలలో చికిత్స పొందుతూ మధు (30) మృతిచెందాడు. ఈ ఘటనపై మాలకొండయ్య సోదరుడు కోటయ్య ఫిర్యాదు మేరకు ఎస్సై వెంకటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
శోకసంద్రంలో పెదవెంకన్నపాలెం
పెదవెంకన్నపాలెం(పొన్నలూరు),న్యూస్లైన్: గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతితో పెదవెంకన్నపాలెం శోకసంద్రమైంది. అద్దంకి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన కసుకుర్తి మాలకొండయ్య, ఆయన ఇద్దరు కుమారులు చనిపోవడంతో మృతదేహాలకు పోస్టుమార్టం అనంతరం ఒంగోలు రిమ్స్ నుంచి మంగళవారం రాత్రి గ్రామానికి తరలించారు. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. మాలకొండయ్యకు భార్య ఉంది. పెద్దకుమారుడు మాల్యాద్రికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. చిన్నకుమారుడు మధుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం కావడంతో పెద్ద దిక్కును కోల్పోయి ఆ కుటుంబం అంతులేని విషాదంలో మునిగిపోయింది. మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
మృత్యు శకటం
Published Wed, Apr 16 2014 3:35 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పశ్చిమ బెంగాల్లో బాంబు పేలుడు.. ఒకరు మృతి!
రేపల్లె గడ్డ దద్దరిల్లే సీఎం జగన్ గూస్ బంప్స్ స్పీచ్
Sakshi News Cartoon: మనమే ఇవ్వలేం! ఇక వాళ్లేందుకిస్తారు!
IPL 2024: ప్లే ఆఫ్స్ అవకాశాలు ఏ జట్టుకు ఎలా..?
ఓటీటీలోకి రాబోతున్న విశాల్ 'రత్నం' సినిమా
సీఎం జగన్ రాయల్ ఎంట్రీ
పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
ప్రజలు జాగ్రత్త.. బాబుపై ద్వారంపూడి సెటైర్లు
దొంగలు దొరికారు
రాజకీయం కోసం ఎంత నీచానికైనా దిగజారతాడు..కన్నబాబు ఫైర్
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- ఐపీఎల్ చరిత్రలో అత్యద్భుతమైన క్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- మంచి మాట: నోరు మంచిదైతే...
Advertisement