ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి | road accident in kurnool | Sakshi
Sakshi News home page

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

Feb 4 2018 9:16 AM | Updated on Aug 30 2018 4:15 PM

road accident in kurnool - Sakshi

సాక్షి, కర్నూలు : పాణ్యం మండలం బలనూరు మెట్ట వద్ద ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎద్దుల బండిని ఓ లారీ ఢీకొనడంతో అక్కడిక్కడే ముగ్గురు మృతి చెందారు.

కొంతమంది స్థానికులు పొలం పనుల కోసం ఎద్దుల బండిపై వెళ్తుడగా  ఓ లారీ  వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే మృతిచెందారు.  మృతులు అంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement