ఒంగోలు ఆర్టీసీ బస్టాండులో రూ.12 లక్షల ఎంపీ ల్యాడ్స్ నిధులతో ఆర్వో ప్లాంట్ను ఏర్పాటు చేశారు.
ఆర్వో ప్లాంట్ను ప్రారంభించిన వైవీ సుబ్బారెడ్డి
Jul 29 2017 2:00 PM | Updated on May 28 2018 1:52 PM
ఒంగోలు: ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు ఆర్టీసీ బస్టాండులో రూ.12 లక్షల ఎంపీ ల్యాడ్స్ నిధులతో ఆర్వో ప్లాంట్ను ఏర్పాటు చేశారు. దీనిని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి శనివారం ప్రారంభించారు. అలాగే అగ్రహారం రైల్వే ఓవర్బ్రిడ్జి, అండర్పాస్ల ఏర్పాటుకు మ్యాప్ను ఆయన పరిశీలించారు. అధికారులతో కలిసి ఆ స్థలాన్ని సందర్శించారు. తక్షణమే కచ్చితమైన ప్లాన్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
Advertisement


