రిషితేశ్వరి కేసు నిందితులకు రిమాండ్ పొడిగింపు | rishiteswari case: accused remand extended for 14 days | Sakshi
Sakshi News home page

రిషితేశ్వరి కేసు నిందితులకు రిమాండ్ పొడిగింపు

Aug 14 2015 12:48 PM | Updated on Sep 3 2017 7:27 AM

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో ముగ్గురు నిందితులకు కోర్టు రిమాండ్ పొడిగించింది.

గుంటూరు : ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో ముగ్గురు నిందితులకు కోర్టు రిమాండ్ పొడిగించింది. ఈ నెల 28 వరకూ నిందితులకు రిమాండ్ కొనసాగించాలని న్యాయస్థానం శుక్రవారం ఆదేశించింది. గతంలో వారు పెట్టుకున్న బెయిల్ పిటిషన్ను కోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. కాగా ఈ కేసులో దుంప హనీషా, జయచరణ్, నరాల శ్రీనివాస్ నిందితులుగా ఉన్న విషయం విదితమే.  A1గా సీనియర్ విద్యార్థిని హనీషా, A2గా జయచరణ్, A3గా శ్రీనివాస్ పేర్లను పోలీసులు నమోదు చేశారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement