రంగారెడ్డి జిల్లాలోనే అత్యధిక ఓటర్లు | Rangareddy district register high number of voters | Sakshi
Sakshi News home page

రంగారెడ్డి జిల్లాలోనే అత్యధిక ఓటర్లు

Mar 5 2014 11:35 AM | Updated on Aug 14 2018 5:54 PM

రాష్ట్రంలో మొత్తం 6,24,32,064 మంది ఓటర్లుగా తేలారు. అందులో రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 50,14,064మంది ఓటర్లు ఉన్నారు.

హైదరాబాద్ : రాష్ట్రంలో మొత్తం 6,24,32,064 మంది ఓటర్లుగా తేలారు. అందులో రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 50,14,064మంది ఓటర్లు ఉండగా, విజయ నగరం జిల్లాలో అతి తక్కువగా 16,88,509మంది  ఓటర్లుగా నమోదయ్యారు. మొత్తం 69,014 పోలింగ్ స్టేషన్లను ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసింది.

రంగారెడ్డి జిల్లాలోనే ఎక్కువగా 4,469 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయగా, నిజామాబాద్ జిల్లాలో 2,005 అతి తక్కువగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికల ఏర్పాట్లపై  రాష్ట్ర ఎన్నికల కమిషనర్ భన్వర్ లాల్ మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement