ప్రత్యేక హోదా భరోసా సభకు రండి
రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం ఈనెల 4వ తేదీన నిర్వహిస్తున్న భరోసా సభకు హాజరు కావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
విపక్ష నేత జగన్కు రఘువీరా లేఖ
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం ఈనెల 4వ తేదీన నిర్వహిస్తున్న భరోసా సభకు హాజరు కావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్కు పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి లేఖ రాశారు. ప్రత్యేక హోదా భరోసా సభకు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, సమాజ్వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్యాదవ్, జనతాదళ్(యూ) మాజీ అధ్యక్షుడు శరత్యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి, కార్యదర్శి రాజా తదితరులు హాజరవుతున్న విషయాన్ని గుర్తు చేశారు. అలాగే జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ను కూడా ఆహ్వానించారు.