ప్రసాద్రెడ్డి అంత్యక్రియలు ప్రారంభం | prasad reddy last rites starts at anantapur district | Sakshi
Sakshi News home page

ప్రసాద్రెడ్డి అంత్యక్రియలు ప్రారంభం

Apr 30 2015 11:22 AM | Updated on May 29 2018 2:42 PM

అనంతపురం జిల్లా రాప్తాడులో దారుణ హత్యకు గురైన వైఎస్ఆర్ సీపీ నేత ప్రసాద్రెడ్డి అంత్యక్రియలు గురువారం ప్రనన్నాయనపల్లిలో ప్రారంభమైనాయి.

అనంతపురం: అనంతపురం జిల్లా రాప్తాడులో దారుణ హత్యకు గురైన వైఎస్ఆర్ సీపీ నేత ప్రసాద్రెడ్డి అంత్యక్రియలు గురువారం ప్రనన్నాయనపల్లిలో ప్రారంభమైనాయి. ప్రసాద్రెడ్డి మృతదేహంతో వైఎస్ఆర్ సీపీ శ్రేణులు ర్యాలీగా బయలుదేరాయి. అంత్యక్రియలకు జిల్లాకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు వై. విశ్వేశ్వరరెడ్డి, చాంద్బాషాలు హాజరయ్యారు.

అలాగే మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు శంకర్నారాయణ, మాజీ ఎమ్మెల్యే గుర్నాధ్రెడ్డి, ఎర్రిస్వామిరెడ్డి హాజరయ్యారు. ప్రసాద్రెడ్డి అంత్యక్రియల సందర్భంగా ప్రసన్నాయనపల్లిలో భారీగా పోలీసులు మోహరించారు.

Advertisement
 
Advertisement
Advertisement