జైరాం రమేష్తో పొన్నాల సమావేశం | Ponnala lakshmiah meets jairam ramesh | Sakshi
Sakshi News home page

జైరాం రమేష్తో పొన్నాల సమావేశం

Mar 3 2014 11:08 AM | Updated on Sep 2 2017 4:19 AM

కేంద్రమంత్రి జైరాం రమేష్తో మాజీమంత్రి పొన్నాల లక్ష్మయ్య సమావేశం అయ్యారు.

హైదరాబాద్ : కేంద్రమంత్రి జైరాం రమేష్తో మాజీమంత్రి పొన్నాల  లక్ష్మయ్య సమావేశం అయ్యారు. శంషాబాద్ విమానాశ్రయంలో జైరాం రమేష్ను ఆయన సోమవారం కలిశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ విలీనంపై వీరిరువురి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. అలాగే వరంగల్లో ఈనెల 5వ తేదీన జరిగే తెలంగాణ విజయోత్సవ బహిరంగ సభకు జైరాం రమేష్ హాజరు కానున్నారు.

మరోవైపు కాంగ్రెస్లో విలీనంపై మధ్యాహ్నం రెండు గంటలకు టీఆర్ఎస్ కీలక సమావేశం జరగనుంది. నాలుగు గంటల పాటు ఈ సమావేశం సుదీర్ఘంగా సాగనుంది. అనంతరం పార్టీ విలీనమా, పొత్తు ఉంటుందా అనే దానిపై కేసీఆర్ ప్రకటన చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement