245 మంది చిన్నారుల గుర్తింపు! | Police Found 245 Children In Operation Muskan Programme In Krishna | Sakshi
Sakshi News home page

ఎస్పీ రవీంద్రనాథ్‌ ఆధ్వర్యంలో ‘ఆపరేషన్‌ ముస్కాన్‌’

Jan 4 2020 2:14 PM | Updated on Jan 4 2020 3:53 PM

Police Found 245 Children In Operation Muskan Programme In Krishna - Sakshi

సాక్షి, కృష్ణాజిల్లా: బడి వయసు పిల్లలకు ఉన్నత విద్య అందించాలనే లక్ష్యంతో ఎస్పీ రవీంద్రనాథ్‌ ఆధ్వర్యంలో ఆపరేషన్‌ ముస్కాన్‌ కార్యక్రమాన్ని పోలీసు అధికారులు శనివారం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పోలీసులు మొత్తం 245 మంది చిన్నారులను గుర్తించారు. ఈ సందర్భంగా ఎస్పీ రవీంద్రనాథ్‌ మీడియాతో మాట్లాడుతూ.. రైల్వేస్టేషన్‌లు‌, దుకాణాలల్లో మొత్తం 245 మంది చిన్నారులను గుర్తించామని, వారిలో 183 మంది బాలురు, 62 మంది బాలికలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో తల్లిదండ్రులు లేని పాపను గుర్తించి.. ఆ చిన్నారిని తిరిగి బడికి వెళ్లేలా ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా మైలవరం సర్కిల్‌ పరిధిలో బడి బయట ఉన్న 29 మంది పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రులకు స్టేషన్‌లో కౌన్సిలింగ్‌ ఇప్పించి పంపించినట్లు ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement