కొండాపూర్, న్యూస్లైన్: పచ్చని పల్లెలు కాలుష్య కోరల్లో చిక్కుకుంటున్నాయి. రాత్రివేళలో పరిశ్రమలు యథేచ్ఛగా విషవాయువులను విడుదల చేయడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే..మండల పరిధిలోని గుంతపల్లి చౌరస్తాలో రెండు మినీ పరిశ్రమలున్నాయి. రెండు నెలల క్రితం మరో పరిశ్రమ కూడా ప్రారంభమైంది. మరో రెండు నిర్మాణంలో ఉన్నాయి. అయితే నిబంధనలకు విరుద్ధంగా పరిశ్రమలు రాత్రి వేళలో యథేచ్ఛగా విషవాయువులను విడుదల చేస్తున్నాయి. పాడైపోయిన వాహనాల టైర్లను అధిక మోతాదులో రాత్రింబవళ్లు కాల్చి అందులోని రసాయనాలను వెలికితీస్తారు.
రసాయనాలను ట్యాంకర్లలో హైదరాబాద్కు తరలిస్తారు. పరిశ్రమల యాజమాన్యాలు వ్యాపారమే ధ్యేయంగా పరిశ్రమలో పనిచేసే కార్మికులను సైతం పట్టించుకోవడం లేదు. వారు శ్వాసకోశ వ్యాధులకు గురవుతున్నా పట్టించుకోవడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదిలాఉండగా టైర్లను కాల్చగా ఏర్పడిన బుడిద పంటపొలాల్లో చేరడంతో పంటలు సైతం దెబ్బతింటున్నాయి. దీంతో రైతులు భారీగా నష్టపోతున్నారు. గుంతపల్లి, తేర్పోల్, గొల్లపల్లి, ఎదురుగూడెం గ్రామాల ప్రజలు ఈ రోడ్డు గుండా రాకపోకలు సాగించే వాహనదారులు పరిశ్రమలు వదిలే విషవాయువులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పరిశ్రమల తీరును నిరసిస్తూ గతంలో పరిశ్రమల వద్ద ధర్నాలు, రాస్తారోకోలు చేసిన సందర్భాలు సైతం ఉన్నాయి. యువజన సంఘాల నాయకులు పీసీబీ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం కనిపించడంలేదు. గ్రీవెన్స్డేలో భాగంగా కలెక్టర్ దృష్టికి విషవాయువుల పరిశ్రమలను మూసివేయాలని ఫిర్యాదు చేసినా స్పందన లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఒకవేళ పరిశ్రమల యాజమాన్యాలను నిలదీస్తే దిక్కున్నచోట చెప్పుకోమని దురుసుగా మాట్లాడుతున్నారని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కాలుష్య కోరల నుంచి గ్రామాలను కాపాడాని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
కాలుష్య కోరల్లో పల్లెలు
Published Mon, Dec 16 2013 1:05 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement