కిరణ్కు పీలేరు సీఐ పూర్తి సహకారం: భూమన | Sakshi
Sakshi News home page

కిరణ్కు పీలేరు సీఐ పూర్తి సహకారం: భూమన

Published Mon, Jan 6 2014 11:37 AM

కిరణ్కు పీలేరు సీఐ పూర్తి సహకారం: భూమన

హైదరాబాద్: సీఎం కిరణ్‌, ఆయన కుటుంబ సభ్యులు అటవీ సంపదను కొల్లగొడుతున్నారని వైఎస్‌ఆర్‌ సీపీ నేత, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ఆరోపించారు. సీఎం తమ్ముడు కిశోర్‌కుమార్‌ రెడ్డి ఎర్రచందనాన్ని దోచుకుంటున్నారని అన్నారు. వీరి అక్రమాలకు పీలేరు సీఐ పూర్తి సహకారం అందిస్తున్నారని తెలిపారు. చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్ల వెనక సీఎం హస్తముందని అంతకుముందు అన్నారు. సీఎం సోదరుడి ప్రోత్సాహం వల్లే స్మగ్లర్లు చెలరేగిపోతున్నారని ఆరోపించారు.

Advertisement
Advertisement