అవమానభారంతో ఫొటోగ్రాఫర్ ఆత్మహత్య | photographer suicide | Sakshi
Sakshi News home page

అవమానభారంతో ఫొటోగ్రాఫర్ ఆత్మహత్య

Aug 11 2013 3:05 AM | Updated on Nov 6 2018 7:53 PM

అవమానభారంతో ఫొటో గ్రాఫర్ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శుక్రవారం రాత్రి మండలంలోని భట్టుపల్లిలో చోటు చేసుకుంది.

పినపాక న్యూస్‌లైన్ : అవమానభారంతో ఫొటో గ్రాఫర్ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శుక్రవారం రాత్రి మండలంలోని భట్టుపల్లిలో చోటు చేసుకుంది. కరకగూడెం ఎస్సై మాచర్ల అరుణ్‌కుమార్ అందించిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని భట్టుపల్లికి చెంది న శివరాత్రి వీరస్వామి(35) గ్రామంలో ఫొటో గ్రాఫర్‌గా పని చేస్తున్నాడు. అతని ఇంటి పక్కనే ఉంటున్న పోగు రాములు కుటుంబానికి అతనికి మధ్య శుక్రవారం స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. 
 
 ఇంటి వద్ద మహిళల కారణంగా ఈ ఘర్షణ చోటు చేసుకోవడంతో రాములు తన సోదరులతో కలిసి వీరస్వామిపై దాడి చేసి గాయపరిచాడు. అందరి ముందు ఈ దాడి జరగడంతో మనస్తాపానికి గురైన వీరస్వామి శుక్రవారం రాత్రి ఇంటి ఎదుట ఉన్న చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రత్యక్ష సాక్షుల ద్వారా ఈ విషయాన్ని నిర్ధారణ చేసుకున్న పోలీసులు ఘర్షణకు పాల్పడిన పోగు రాములు అతని భార్య లలిత, దాడికి సహకరించిన పోగు వెంకటయ్య, లక్ష్మినర్సు, సత్తెమ్మ, లక్ష్మిలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బూర్గంపాడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement