'బాబుకు.. ప్రజలే ఎన్నికల్లో బుద్ధి చెబుతారు'


విజయనగరం: రెండు కళ్ల సిద్దాంతాన్ని నమ్ముకున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని వైఎస్‌ఆర్‌ సీపీ నేత సుజయ్‌కృష్ణరంగారావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విజయనగరం జిల్లాలోని మక్కువలో శనివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమైక్య శంఖారావం సభను నిర్వహించారు.


 


ఈ కార్యక్రమంలో  పెన్మత్స, సుజయకృష్ణరంగారావు, రాజన్నదొరలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్‌ సీపీ నేత సుజయ్‌కృష్ణరంగారావు మాట్లాడుతూ.. ఓట్లు, సీట్ల కోసం రాహుల్గాంధీని ప్రధాని చేయాలని కాంగ్రెస్ చూస్తోందని విమర్శించారు. ఈ సమైక్య శంఖారావం కార్యక్రమానికి గిరిజనులు భారీగా తరలివచ్చారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top