⇒ వైఎస్సార్సీపీ నేత భూమిరెడ్డి శివప్రసాదరెడ్డి దారుణహత్య
⇒ రాప్తాడు తహశీల్దార్ కార్యాలయంలో నరికి చంపిన ప్రత్యర్థులు
⇒ పోలీసులు, రెవెన్యూ అధికారుల అండతో మంత్రి పరిటాల సునీత హత్య చేయించారని బంధువుల ఆరోపణ
⇒ తహశీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలకు నిప్పు.. రాప్తాడులో ఉద్రిక్తత
⇒ పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు
⇒ 13 మందిపై కేసు.. నిందితుల్లో ఎంపీపీ దగ్గుపాటి ప్రసాద్, ఉప్పర శ్రీనివాసులు
(సాక్షి ప్రతినిధి, అనంతపురం): రాప్తాడు మండలం ప్రసన్నాయపల్లికి చెందిన వైఎస్సార్సీపీ కీలక నేత భూమిరెడ్డి శివ ప్రసాదరెడ్డిని ప్రత్యర్థులు పథకం ప్రకారమే హత్య చేసినట్లు స్పష్టమవుతోంది. బుధవారం రాప్తాడు తహశీల్దార్ కార్యాలయంలో అధికారులందరూ చూస్తుండగానే వేటకొడవళ్లతో అతి కిరాతకంగా నరికి చంపారు. పోలీసులు, రెవెన్యూ అధికారుల సహకారంతో మంత్రి పరిటాల సునీత ఈ హత్య చేయించారని ప్రసాదరెడ్డి బంధువులు ఆరోపిస్తున్నారు. హత్యతో రాప్తాడుతో పాటు అనంతపురంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ప్రసాదరెడ్డి మొన్నటిదాకా వైఎస్సార్సీపీ రాప్తాడు మండల కన్వీనర్గా కొనసాగారు. ప్రస్తుతం ఆయన భార్య సావిత్రి ప్రసన్నాయపల్లి సర్పంచ్గా ఉన్నారు. ప్రసాదరెడ్డి ఓ వ్యక్తిగత పని కోసం తహశీల్దార్ కార్యాలయానికి కొన్నిరోజులుగా వస్తూ పోతూ ఉండేవారు. దీన్ని గమనించిన ప్రత్యర్థులు హత్యకు పక్కా వ్యూహం రచించారు. బుధవారం మధ్యాహ్నం 12.10 గంటలకు ప్రసాదరెడ్డి తన అనుచరుడు శివయాదవ్తో కలిసి తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లారు. ఆర్ఐ దివాకర్ గదిలో కూర్చొన్నారు.
అప్పటికే ఎనిమిది మంది దుండగులు అక్కడ మాటు వేసివున్నారు. ప్రసాదరెడ్డి ఆర్ఐ ఛాంబర్లోకి వెళ్లిన కొద్దిసేపటికే వారు కార్యాలయం లోపలికి చొరబడ్డారు. మొదట కొందరు ప్రసాద్ అనుచరుడు శివను కంప్యూటర్ గదిలో నిర్బంధించి.. తలుపు వేశారు. ఇంకొందరు ఆర్ఐ ఛాంబర్లోకి వెళ్లి తలుపులు మూసి.. వేటకొడవళ్లతో ప్రసాదరెడ్డిపై విరుచుకుపడ్డారు. మెడపై బలంగా నరికారు. రక్షించుకునే ప్రయత్నంలో ప్రసాదరెడ్డి చేయి అడ్డుపెట్టగా.. చేతివేళ్లు తెగిపోయాయి. ఆయన ఒక్కడే కావడం...ప్రత్యర్థులు భారీగా ఆయుధాలతో రావడంతో ఏమీ చేయలేకపోయారు. వారి దాడిలో అక్కడికక్కడే ప్రాణాలొదిలారు. ప్రసాదరెడ్డికి కుమారుడు రమణారెడ్డి ఉన్నారు.
బోరున విలపించిన కుటుంబ సభ్యులు
హత్య విషయం తెలీగానే ప్రసాదరెడ్డి భార్య సావిత్రి, సోదరుడు మహానందరెడ్డితో పాటు కుటుంబ సభ్యులు ఘటన స్థలికి చేరుకున్నారు. రక్తపు మడుగుల్లో ఉన్న ప్రసాదరెడ్డిని చూసి బోరున విలపించారు. ‘వస్తానని చెప్పి వెళ్లి ఇలా అయ్యాడే’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఇంతలోనే భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు, ప్రసాదరెడ్డి అనుచరులు అక్కడికి వచ్చారు. ఆగ్రహావేశాలకు లోనయ్యారు. తహశీల్దార్ కార్యాలయంలోని ఫర్నీచర్తో పాటు రికార్డులను ధ్వంసం చేసి.. నిప్పటించారు. బైక్లకు నిప్పటించారు. మండల పరిషత్ కార్యాలయంలోకీ చొరబడి.. ఫర్నీచర్ను ధ్వంసం చేసి, నిప్పటించారు. దీంతో పోలీసు బలగాలను భారీగా రప్పించారు. ఎస్పీతో పాటు పలువురు డీఎస్పీలు, సీఐలు, స్పెషల్పార్టీ పోలీసులు చేరుకున్నారు.
ఎస్పీ కార్యాలయం ఎదుట ఉద్రిక్తత
పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని దివంగత సీఎం రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద తీసుకెళ్లేందుకు ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, కార్యకర్తలు భారీర్యాలీగా బయలుదేరారు. ఎస్పీ కార్యాలయం వద్ద ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. మరో దారి గుండా వెళ్లాలని సూచించారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. శాంతియుతంగా వైఎస్సార్ విగ్రహం వద్దకు వెళ్లడం కూడా తప్పేనా అని మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి పోలీసులను నిలదీశారు. పది నెలల్లో చాలా ఘోరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయని, పోలీసులు ఏం చేశారని అనంత వెంకట్రామిరెడ్డి నిలదీశారు.
డీజీపీ వచ్చిన రోజే పెద్దవడుగూరులో హత్య, అనంతపురం తహశీల్దార్ షేక్ మహబూబ్ బాషాపై దాడి చేశారని గుర్తు చేశారు. ఇవాల తహశీల్దార్ కార్యాలయంలోనే ప్రసాదరెడ్డిని హతమార్చారన్నారు. ఇవన్నీ మీ నిర్లక్ష్యంతోనే జరిగాయంటూ మండిపడ్డారు. డీఎస్పీలు చివరకు జిల్లా ఎస్పీకి సమాచారాన్ని అందించారు. ఎస్పీ వచ్చి ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకుంటామనడంతో వారు శాంతించారు.
పక్కా వ్యూహం ప్రకారం హత్య
ప్రసాదరెడ్డి హత్య పక్కా వ్యూహం ప్రకారం జరిగింది. ప్రసాదరెడ్డి బుధవారం తహశీల్దార్ కార్యాలయానికి వస్తారనే సంగతిని ప్రత్యర్థులు ముందే ఎలా పసిగట్టారనే దానిపై బోలెడు అనుమానాలు తలెత్తుతున్నాయి.కార్యాలయానికి ప్రసాదరెడ్డిని..తహశీల్దార్ హరికుమార్, ఆర్ఐ దివాకర్ ఫోన్ చేసి పిలిపించినట్లు ఆయన సోదరుడు మహానందరెడ్డి చెబుతున్నారు. పైగా ప్రత్యర్థులు ఆర్ఐ ఛాంబర్లోకి వచ్చిన తర్వాత అక్కడి బీరువాలో నుంచి వేటకొడవళ్లను తీసుకున్నారని కూడా తెలుస్తోంది. అంటే పథకం ప్రకారమే వేటకొడవళ్లను బీరువాలో ఉంచి, హత్యకు రెవె న్యూ అధికారులు కూడా సహకరించారని తెలుస్తోంది.
ఎస్ఐ నాగేంద్రప్రసాద ఆధ్వర్యంలోనే హత్య?
ప్రసాదరెడ్డి హత్యకు రాప్తాడు ఎస్ఐ నాగేంద్రప్రసాద్ పూర్తిగా సహకరించారని మహానందరెడ్డి ఆరోపిస్తున్నారు. తహశీల్దార్ కార్యాలయం, పోలీసుస్టేషన్ పక్కపక్కనే ఉన్నాయి. రెంటికీ ముళ్లకంచె మాత్రమే అడ్డు. పైగా హత్య జరిగిన ప్రదేశంలో ఎస్ఐ నాగేంద్రప్రసాద్ నేమ్బ్యాడ్జీ దొరికింది. అది ఊడిపోయి ఉందంటే తోపులాట లేదా ఘర్షణ జరిగి ఉండాలని, అంటే ఎస్ఐ కూడా హత్య జరిగే సందర్భంలో ఉన్నట్లేనని బంధువులు ఆరోపిస్తున్నారు. నాగేంద్రప్రసాద్ ఇటీవలే పరిటాల సునీత సొంత మండలం రామగిరి నుంచి రాప్తాడుకు బదిలీ అయ్యారు. టీడీపీ నేతలకు ఈయన పూర్తిగా సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ప్రసాదరెడ్డి హత్య కుట్రలో భాగంగానే నాగేంద్రప్రసాద్ను రాప్తాడుకు బదిలీ చేయించినట్లు ప్రసాదరెడ్డి బంధువులు ఆరోపిస్తున్నారు.
13 మందిపై కేసు : ప్రసాదరెడ్డి హత్యకు సంబం ధించి 13 మందిపై కేసు నమోదు చేశారు. రాప్తాడు ఎంపీపీ దగ్గుపాటి ప్రసాద్, ఉప్పర శ్రీనివాసులతో పాటు పలువురిని నిందితులుగా పేర్కొన్నారు.
తలశిల రఘురాం పరామర్శ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రాం కో ఆర్డినేటర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ప్రసాదరెడ్డి కుటుంబీకులను ఓదార్చారు. వారి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రసాదరెడ్డి తమ్ముడు మహానంద రెడ్డితో మాట్లాడారు.
మృతదేహం తీసుకెళ్లకుండా ఆందోళన
ప్రసాదరెడ్డి మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే పార్టీ కార్యకర్తలు, మిహ ళలు తహశీల్దార్ కార్యాలయం గేటు ఎదురుగా బైఠాయించి ఆందోళన చేశారు. చివరకు ఎస్పీ రాజశేఖర్బాబు.. ప్రసాదరెడ్డి సోదరుడు మహానందరెడ్డి,మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డితో చర్చించారు.
మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు సహకరించాలని కోరారు. దీంతో ప్రసాదరెడ్డి వాహనంలోనే మృతదేహాన్ని అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, చాంద్బాషా, పార్టీ రాష్ట్రప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గురునాథరెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, పార్టీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం, క్రమశిక్షణ కమిటీ సభ్యులు ఎర్రిస్వామిరెడ్డి, తోపుదుర్తి భాస్కర్రెడ్డితో పాటు భారీ సంఖ్యలో కార్యకర్తలు ప్రభుత్వాస్పత్రి మార్చురీ వద్దకు వచ్చారు.
పథకం ప్రకారమే..
Published Thu, Apr 30 2015 4:18 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 04-10)
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
ఆర్సీబీతో మ్యాచ్.. గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్! తుది జట్లు ఇవే
గవర్నర్పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీ దుష్ప్రచారంపై ఈసీ సీరియస్
'లగ్గం' షూటింగ్ పూర్తి.. త్వరలో థియేటర్లలో రిలీజ్
త్వరలో కాంగ్రెస్ చీలిపోతుంది: ఆచార్య ప్రమోద్ కృష్ణం
బోయింగ్ ‘స్టార్ లైనర్’.. సునీత ‘స్టార్ ట్రెక్’!
నా ఐపీఎల్ టీమ్కు మాటిచ్చా.. అందుకే సినిమాలకు బ్రేక్
పలమనేరు: ఉప్పొంగిన అభిమాన సంద్రం (ఫొటోలు)
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement