విశాఖపట్నం : ఉపకార వేతనాలు, ఫీజుల వాపస్ గడువు సోమవారంతో ముగుస్తుందని తెలిసి బీసీ సంక్షేమశాఖ, సాంఘిక సంక్షేమశాఖ కార్యాలయాలకు పెద్ద సంఖ్యలో విద్యార్థులు వచ్చారు. దీంతో ఆ కార్యాలయాలు కిక్కిరిసిపోయాయి. ఈ-పాస్ వెబ్సైట్లో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని సోమవారం ఎంవీపీ కాలనీలోని సంక్షేమ కార్యాలయాలకు వచ్చిన బీసీ, ఎస్సీ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విద్యాసంవత్సరం (2014-15)లో 40 వేల మంది బీసీ విద్యార్థులకు ఇప్పటికి 9వేల మందే దరఖాస్తు చేశారు. వీరికి ఫీజుల కోసం రూ.85 కోట్లు, ఈబీసీలకు ఫీజుల కోసం రూ.30 కోట్ల బడ్జెట్ అవసరముంటుంది. ఇక బీసీలకు ఉపకార వేతనాల కోసం రూ.20 కోట్ల బడ్జెట్ అవసరం. ఇక ఎస్సీ విద్యార్థులు 6380 మందికి 2902 మందే దరఖాస్తు చేయగలిగారు.
వీరికి ఫీజులు, ఉపకారవేతనాల కోసం రూ.10 కోట్ల బడ్జెట్ అవసరముంటుంది. జిల్లాలోని 535 కళాశాలలకు చెందిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ఈ ఏడాది రెన్యువల్, ఫ్రెష్ విద్యార్థులనుంచి ఒకేసారి దరఖాస్తులు స్వీకరించడంతో ఈ-పాస్ వెబ్సైట్పై ఒత్తిడి పెరిగిపోయి, తరచూ లింక్ఫెయిలవుతోందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
కిటకిటలాడుతున్న నెట్సెంటర్లు
వారం రోజులుగా జిల్లావ్యాప్తంగా మీ-సేవ, ఏపీ ఆన్లైన్, ఇంటర్నెట్ కేంద్రాలు కిటకిటలాడుతున్నాయి. రోజూ అధిక సంఖ్యలో విద్యార్థులు వచ్చి దరఖాస్తు చేసుకుంటున్నారు. పలువురు విద్యార్థులు ధ్రువపత్రాల కోసం తహశీల్దార్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ ఏడాది జూన్లో రాష్ట్రం విడిపోయిన దృష్ట్యా జూన్ తర్వాత తీసుకున్న ధ్రువపత్రాలనే పరిగణనలోకి తీసుకుంటున్నారు.
కళాశాలల నిర్లక్ష్యం
విద్యార్థులకు ఫీజులు, ఉపకారవేతనాల మంజూరు విషయంలో కళాశాలల నిర్లక్ష్యం వల్లే ఆలస్యమవుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విద్యాసంవత్సరంలో జిల్లాలోని 75 కళాశాలలు ఇంకా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ఫారాలు పొందుపరచలేదు. దీంతో ఆ యా కళాశాలల విద్యార్థుల దరఖాస్తులు కన్ఫర్మ్ కావడం లేదని సంక్షేమశాఖల అధికారు లు అంటున్నారు. రెండేళ్లుగా దరఖాస్తుల పరి శీలన అధికారులుగా కళాశాలల ప్రిన్సిపాళ్లే వ్య వహరిస్తున్నారు.
కానీ ఏ సమస్య వచ్చినా సరే ఎంవీపీ కాలనీలోని సంక్షేమశాఖల కార్యాలయాలకు వెళ్లిపోండని చెప్పడంతో విద్యార్థులు పాఠాలు మానేసి మరీ వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. గత ఏడాదికి చెందిన 1200 ఎస్సీ దరఖాస్తులు ఇప్పటికీ కళాశాలల్లోనే మూలుగుతున్నాయి. ఈ దరఖాస్తులను ఈ నెల 14 లోగా జిల్లాకేంద్రానికి పంపుకోవాలని సాంఘికసంక్షేమశాఖ డీడీ ఒక ప్రకటనలో కోరారు.
దరఖాస్తు గడువు పెంపు
గడువులోగా విద్యార్థులంతా దరఖాస్తు చేసుకోలేకపోవడంతో ప్రభుత్వం రెన్యువల్ విద్యార్థుల దరఖాస్తు గడువును ఈ నెల 10 నుంచి 17వ తేదీ వరకు పొడిగించిందని సాంఘిక సంక్షేమశాఖ డెప్యూటీ డెరైక్టర్ డి.వి.రమణమూర్తి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫ్రెష్ విభాగం విద్యార్థులకు ఈ నెల 30వ తేదీ వరకు గడువు ఉందని గుర్తు చేశారు. విద్యార్థులు ఈ ఏడాది జూన్ తర్వాత తీసుకున్న ధ్రువపత్రాలు అప్లోడ్ చేసుకోవాలని స్పష్టం చేశారు.
‘ఉపకారం’ కోసం పాట్లు
Published Tue, Nov 11 2014 1:10 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మూకుమ్మడిగా సెలవు పెట్టిన ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ఉద్యోగులు
Yashika Aannand: అందాలతో మైండ్ బ్లాక్ చేస్తున్న యాషిక ఆనంద్ (ఫొటోలు)
Paris Olympics 2024: భారత రెజ్లర్లకు ఆఖరి అవకాశం
65 ఏళ్లలో 7.8 శాతం తగ్గిన హిందూ జనాభా
కాసేపట్లో కర్నూలులో సీఎం జగన్ ప్రచారం
Mayawati: మేనత్త నిర్ణయంపై పెదవి విప్పిన ఆకాష్ ఆనంద్
ఎన్నికల ప్రచారంలో మంత్రి రోజాకు అపూర్వ స్వాగతం
జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
పచ్చ మద్యం స్వాధీనం..
SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
తప్పక చదవండి
- జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
- SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
- PK: 'పులుసు కారుతోంది'..!
- ప్రచారంలో సీనియర్ హీరో స్టెప్పులు!
- SRH: వాళ్లిద్దరు పిచ్ను మార్చేశారు.. అతడొక అద్భుతం!
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
- మా గురించి మాట్లాడేందుకు మీరెవరు?: వరలక్ష్మి శరత్కుమార్
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- మా పిల్లల చదువులపై కుట్రలొద్దు బాబూ
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
Advertisement