ఓంఎంసీ కేసు విచారణ 19కు వాయిదా.. | onc trial postponed to 19 .. | Sakshi
Sakshi News home page

ఓంఎంసీ కేసు విచారణ 19కు వాయిదా..

Jan 30 2015 6:51 AM | Updated on Sep 2 2017 8:32 PM

ఓఎంసీ కేసులో నిందితుడు గాలి జనార్దనరెడ్డి, బీవీ శ్రీనివాసరెడ్డి, గనుల శాఖ మాజీ డెరైక్టర్ రాజగోపాల్ గురువారం సీబీఐ ప్రత్యేక కోర్టు ముందు హాజరయ్యారు.

సాక్షి, హైదరాబాద్: ఓఎంసీ కేసులో నిందితుడు గాలి జనార్దనరెడ్డి, బీవీ శ్రీనివాసరెడ్డి, గనుల శాఖ మాజీ డెరైక్టర్ రాజగోపాల్ గురువారం సీబీఐ ప్రత్యేక కోర్టు ముందు హాజరయ్యారు. వీరి హాజరును నమోదుచేసుకున్న ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి ఎన్.బాలయోగి తదుపరి విచారణను ఫిబ్రవరి 19కి వాయిదా వేశారు. అలాగే ఈ కేసు విచారణలో భాగంగా నిందితులపై అభియోగాల నమోదు ప్రక్రియపై అభ్యంతరాలుంటే తెలపాలని నిందితుల తరఫు న్యాయవాదులకు సూచించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement