సుబాబుల్, జామారుుల్ రైతులు విలవిల
కొనుగోళ్లు చేయని పేపర్మిల్లు యూజమాన్యాలు
తప్పనిసరై బ్రోకర్లకు అమ్ముకుంటున్న రైతులు
నేడు మానిటరింగ్ కమిటీ సమావేశం
సుబాబుల్, జామారుుల్ కొనుగోలులో పేపర్ మిల్లుల యూజమాన్యాలు ఒప్పందాలు పాటించడం లేదు. దీంతో రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో బ్రోకర్లకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తోంది. దీనిపై మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం కనిపించడం లేదు.
ఒంగోలు : జిల్లాలో ఎంతోకొంత లాభసాటిగా ఉన్న సుబాబుల్, జామాయిల్ అమ్మకాలు కూడా బ్రోకర్ల చేతుల్లోకి వెళ్లిపోయాయి. దీంతో రైతులకు అగ్రిమెంట్ ప్రకారం ధర రాక తక్కువకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైతుల వద్ద నుంచి పేపర్ మిల్లులు నేరుగా కొనుగోలు చేయడం లేదు. దీంతో రైతులు నష్టపోయే పరిస్థితి ఉంది. దీనిపై ప్రకాశం జిల్లా కలెక్టర్ జూన్లో మానిటరింగ్ కమిటీని వేశారు. ఇందులో రైతుసంఘం నేతలతో పాటు మార్కెటింగ్ అధికారులు కూడా ఉన్నారు. రైతుల నుంచి పేపర్ మిల్లులు కొనుగోలు చేయడం లేదనే విషయం ఈ కమిటీ పర్యవేక్షణలో కూడా తేలింది. ఈ నేపథ్యంలో బుధవారం ఒంగోలులో మానిటరింగ్ కమిటీతో పాటు పేపర్ మిల్లుల యాజమాన్యాలతో జిల్లా కలెక్టర్ విజయకుమార్ సమావేశం ఏర్పాటు చేశారు.
గత ఫిబ్రవరిలో ఒప్పందం...
జిల్లాలోని సంతనూతలపాడు, అద్దంకి, ఒంగోలు, దర్శి, కనిగిరి, కందుకూరు, కొండపి, గిద్దలూరు, యర్రగొండపాలెం, మార్కాపురం నియోజకవర్గాల్లో సుమారు రెండు లక్షల ఎకరాల్లో సుబాబుల్, జామాయిల్ తోటలు వేశారు. వీటికి సంబంధించి 2014 ఫిబ్రవరి 18న కృష్ణాజిల్లా నందిగామలో సుబాబుల్కు టన్నుకు రూ.4,400 చెల్లించే విధంగా రైతులకు, పేపర్ మిల్లుల యాజమాన్యాలకు మధ్య ఒప్పందం కుదిరింది. మన జిల్లాలో ఆ ఒప్పందం అమలు కాకపోవడంతో రైతుసంఘాలు జూన్లో కలెక్టర్ను కలిసి విన్నవించాయి. దీంతో ఆయన పేపర్మిల్లు యాజమాన్యాలను కూర్చోబెట్టి సుబాబుల్తో పాటు జామాయిల్కు ఒప్పందం కుదిర్చారు. సుబాబుల్కు టన్నుకు రూ.4,400, జామాయిల్కు రూ.4,600 చెల్లించేలా కుదిరింది.
ఒప్పందం ప్రకారం కొనుగోళ్లు చేయని యూజమాన్యాలు...
జిల్లాలో మార్కెట్ కమిటీలు ఎంపిక చేసిన 30 వేబ్రిడ్జిల వద్ద సరకు అమ్మేలా ఏర్పాట్లు చేశారు. ఇక్కడకు రైతులు సరకును తెస్తే పేపర్మిల్లు యాజమాన్యాలు ఎంపిక చేసిన అధీకృత ఏజెంట్లు కొనుగోలు చేస్తారు. అయితే కంపెనీలు అధీకృత ఏజెంట్లను ఏర్పాటు చేయలేదు. జిల్లాలో ఒక వందమంది అనధికార ఏజెంట్లను ఏర్పాటు చేశారు. వీరు రైతులు సరకు తీసుకువస్తే కొనడం లేదు. దీంతో రైతులు అనివార్యంగా బ్రోకర్లకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తోంది. గతంలో దీనిపై సంతనూతలపాడు వద్ద రైతుసంఘాలు అనేక సార్లు రాస్తారోకోలు చేశాయి. ఆందోళన చేసిన సమయంలో మొక్కుబడిగా కొనుగోలు చేసినా తర్వాత కొనడం లేదు. దీనిపై మానిటరింగ్ కమిటీ మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకపోయింది. జిల్లాలో గత మూడు నెలల కాలంలో రైతుల వద్ద నుంచి సుమారు 25 వేల టన్నుల జామాయిల్, సుబాబుల్ అమ్మకాలు జరిగాయి. రైతులకు ఒప్పందం ప్రకారం ధర చెల్లించాల్సి ఉండగా, టన్ను సుబాబుల్కు రూ.3,700, జామారుుల్కు రూ.3,500 మాత్రమే చెల్లించారు. దీంతో రైతులు టన్ను సుబాబుల్కు రూ.500, జామాయిల్కు రూ.1,100 చొప్పున నష్టపోతున్నారు.
మరో 30 వేల ఎకరాల్లో కటింగ్...
వచ్చే మూడు నెలల్లో సుమారు 30 వేల ఎకరాల్లో సుబాబుల్, జామాయిల్ కటింగ్ చేస్తారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని పేపర్ మిల్లుల నుంచి సరైన ధర ఇప్పించని పక్షంలో రైతాంగం పూర్తిగా నష్టపోయే పరిస్థితి ఉంది. పేపర్ రేట్లు భారీగా పెరుగుతున్నా సుబాబుల్, జామాయిల్ ధర మాత్రం పెరగడం లేదు. దీంతో రైతాంగం ఆందోళన చెందుతోంది. ఇప్పటికైనా తమకు న్యాయమైన ధర అందేలా చూడాలని అధికారులను వేడుకుంటున్నారు.
దక్కని ధర
Published Wed, Oct 29 2014 3:31 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
వరల్డ్కప్ సెలక్టయ్యాడు.. వరుసగా రెండో మ్యాచ్లో గోల్డెన్ డక్
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (05-05-2024)
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సుప్రీం చీఫ్ జస్టిస్
చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
IPL 2024 PBKS VS CSK: రుతురాజ్ను వెంటాడుతున్న దరిద్రం
ఉంగరంతో ఆరోగ్యం పదిలం!
తప్పక చదవండి
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- ఇదేం ఫ్యామిలీ రా సామీ! ఏకంగా కోబ్రాకే నేరుగా..!
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement