వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి చుట్టూ రాష్ట్ర రాజకీయాలు తిరుగుతున్నాయని వక్తలు తెలిపారు.
సాక్షి, తిరుపతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి చుట్టూ రాష్ట్ర రాజకీయాలు తిరుగుతున్నాయని వక్తలు తెలిపారు. శుక్రవారం తిరుపతి టీఎంఆర్ కల్యాణ మండపంలో పార్టీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. వైఎస్.జగన్ మోహన్రెడ్డిని సీఎం చేసుకోవాలని, తిరుపతిలో భూమన కరుణాకరరెడ్డిని 50 వేల మెజారిటీతో గెలుపించుకోవాలని తీర్మానించారు. కరుణాకరరెడ్డి నాయకత్వంలో సమైక్య ఉద్యమాన్ని ఉధృతం చేయాలనే ప్రతిపాదనను ఆమోదించారు.
సమావేశానికి నాయకత్వం వహించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇడుపులపాయలో జరిగిన పార్టీ ప్లీనరీ సమావేశంలో పేర్కొన్న కొత్త పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. వైఎస్ హయాంలో అమలై ప్రస్తుతం నిలిచిపోయిన వాటిని పునరుద్ధరిస్తామనే విషయాన్నీ ప్రజలకు వివరించాలన్నారు. కాంగ్రెస్తో కుమ్మక్కు అయినందుకే జగన్మోహన్రెడ్డికి బెయిలు వచ్చినట్లు చెప్పుకుంటున్న టీడీపీ ఆరోపణలపై ఎదురు దాడికి దిగాలన్నారు. ఐదు నెలలు కష్టపడితే మరో ఐదే ళ్లు తాను ప్రజల కోసం పనిచేస్తానని చెప్పారు.
అధ్యక్షత వహిం చిన పాలగిరి ప్రతాప్రెడ్డి మాట్లాడుతూ తిరుపతి అభివృద్ధి కరుణాకరరెడ్డి వల్లే సాధ్యమవుతుందన్నారు. యువజన విభాగం నేత భూమన అభినయ్రెడ్డి మాట్లాడుతూ సమైక్య ఉద్యమానికి, రానున్న ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఎస్కే.బాబు మాట్లాడుతూ సర్వసభ్య సమావేశానికి వందలాది మంది రావడం పార్టీ పటిష్టతను తెలియజేస్తోందన్నారు.
ఈ సమావేశంలో మహిళా కన్వీనర్ కుసుమ, మైనారిటీ కన్వీనర్ షఫీ అహ్మద్ ఖాద్రీ, యువజన విభాగం కన్వీనర్ ఇమామ్, ఎస్సీ విభాగం కన్వీనర్ రాజేంద్ర, లీగల్ సెల్ సభ్యులు యుగంధర్, నాయకులు చంద్రశేఖర్, సాకం ప్రభాకర్, చెంచయ్య యాదవ్, వెంకటమునిరెడ్డి, కేతం రామారావు, దుద్దేల బాబు, మబ్బు నాదమునిరెడ్డి, తొండమనాటి వెంకటేష్, రాయలసీమ ఆనంద్రెడ్డి, నెమ్మలి పార్థసారథి, పుల్లయ్య, ఎంవీఎస్.మణి, పెంచలయ్య, చిన్నముని, నూరుల్లా, పుష్పాచౌదరి, లతారెడ్డి, ప్రతిమారెడ్డి, గీత, పునీత, శాంతారెడ్డి ప్రసంగించారు.