'కొత్త సెట్‌టాప్ బాక్సులు ఏర్పాటు చేసుకోవాలి' | Sakshi
Sakshi News home page

'కొత్త సెట్‌టాప్ బాక్సులు ఏర్పాటు చేసుకోవాలి'

Published Tue, May 24 2016 3:29 PM

'New set top box necessary for Internet, Cable, Mobile'

విజయవాడ : జూలై నాటికి ఫైబర్ ఆప్టికల్ గ్రిడ్ పనులు పూర్తవుతాయని.. అయితే వాటికి ప్రస్తుతం ఉన్న సెట్ టాప్ బాక్సులు పనిచేయవు కాబట్టి కేబుల్, ఇంటర్నెట్, మొబైల్ సౌకర్యం కోసం కొత్త సెట్ టాప్ బాక్సులు ఏర్పాటు చేసుకోవాలని ఏపీ ఇంధనశాఖ కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. కొత్త సెట్ టాప్ బాక్సుల కోసం చైనా పరిశ్రమను సంప్రదిస్తున్నామని అన్నారు. అలాగే భోగాపురం ఎయిర్ పోర్టుకు భూ సేకరణ చేస్తామని, జూన్ 30 నాటికి ఎయిర్ పోర్టు భూములు సేకరిస్తామని అజయ్ జైన్ చెప్పారు.

Advertisement
Advertisement