breaking news
fiber optic grid
-
'కొత్త సెట్టాప్ బాక్సులు ఏర్పాటు చేసుకోవాలి'
విజయవాడ : జూలై నాటికి ఫైబర్ ఆప్టికల్ గ్రిడ్ పనులు పూర్తవుతాయని.. అయితే వాటికి ప్రస్తుతం ఉన్న సెట్ టాప్ బాక్సులు పనిచేయవు కాబట్టి కేబుల్, ఇంటర్నెట్, మొబైల్ సౌకర్యం కోసం కొత్త సెట్ టాప్ బాక్సులు ఏర్పాటు చేసుకోవాలని ఏపీ ఇంధనశాఖ కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. కొత్త సెట్ టాప్ బాక్సుల కోసం చైనా పరిశ్రమను సంప్రదిస్తున్నామని అన్నారు. అలాగే భోగాపురం ఎయిర్ పోర్టుకు భూ సేకరణ చేస్తామని, జూన్ 30 నాటికి ఎయిర్ పోర్టు భూములు సేకరిస్తామని అజయ్ జైన్ చెప్పారు. -
సామాన్యుడికి మేలుచేయని టెక్నాలజీ వృథా
స్మార్ట్ టెక్నాలజీలు కేవలం నగరాలకు మాత్రమే పరిమితం కావడం సరికాదని, మన పల్లెలు కూడా వాటి ప్రయోజనాలను పొందాలని తెలంగాణ ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె. తారక రామారావు అన్నారు. స్మార్ట్ టెక్నాలజీలపై హైదరాబాద్లో జరుగుతున్న జాతీయ సదస్సులో కేటీఆర్ ప్రసంగించారు. ఫైబర్ ఆప్టిక్ గ్రిడ్ పొందిన అతి తక్కువ రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటని ఆయన చెప్పారు. దీని ద్వారా రాష్ట్రంలో అన్ని ఇళ్లకూ టెక్నాలజీ అందుబాటులోకి వస్తుందన్నారు. డిజిటల్ లిటరసీ మిషన్ అనే మరో ప్రధాన కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రం చేపట్టిందని, దీని ద్వారా ప్రతి కుటుంబంలో కనీసం ఒక వ్యక్తికి డిజిటల్ అక్షరాస్యత కల్పించడం తమ లక్ష్యమని అన్నారు. సామాన్యుడికి ప్రయోజనం కలిగించని టెక్నాలజీ వృథాయేనని వ్యాఖ్యానించారు. స్మార్ట్ సిటీల నిర్మాణం మంచిదే అయినా, పల్లెలే దేశానికి వెన్నెముక అన్న విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలన్నారు. తెలంగాణ రైతులకు కూడా సాయం చేసేందుకు తమ ప్రభుత్వం స్మార్ట్ టెక్నాలజీని ఉపయోగించుకుంటోందని కేటీఆర్ చెప్పారు. Smart Technologies need not necessarily be restricted to Cities alone. Our villages should also benefit from Smart Tech: KTR at #NCST — Min IT, Telangana (@MinIT_Telangana) August 22, 2015 We are one of the first states to have a ambitious fiber optic grid, connecting all the houses in the state: KTR at #NCST — Min IT, Telangana (@MinIT_Telangana) August 22, 2015 Telangana has also embarked on another major initiative - Digital Literacy mission, to make one person per family Digitally literate: KTR — Min IT, Telangana (@MinIT_Telangana) August 22, 2015 Technology that does not benefit the common man would be futile: KTR — Min IT, Telangana (@MinIT_Telangana) August 22, 2015 While Smart Cities are good, we should also remember that India still lives in the villages: KTR — Min IT, Telangana (@MinIT_Telangana) August 22, 2015 Our government is using smart technology to help our farmers: KTR — Min IT, Telangana (@MinIT_Telangana) August 22, 2015