
మంద కృష్ణ మాదిగ
చట్టసభల్లో తమ వాణి వినిపించేందుకు కొత్తగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ఎంఆర్పిఎస్ (మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి)అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ చెప్పారు.
హైదరాబాద్: చట్టసభల్లో తమ వాణి వినిపించేందుకు కొత్తగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ఎంఆర్పిఎస్ (మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి)అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ చెప్పారు. జనవరి 4న హైదరాబాద్లో పార్టీ పేరు ప్రకటిస్తామని ఆయన తెలిపారు.
ఇప్పుడున్న పార్టీలలో సామాజిక న్యాయం లేదన్నారు. ఎన్నో ఏళ్లుగా తమ సమస్యలపై పోరాడుతున్నా పరిష్కారం దొరకడంలేదని చెప్పారు. అసెంబ్లీలో తమ వాణి వినిపించేందుకే పార్టీని పెడుతున్నట్లు తెలిపారు.