ఆధిపత్య పోరాటం | Municipal chairman X MLA | Sakshi
Sakshi News home page

ఆధిపత్య పోరాటం

Sep 9 2014 3:50 AM | Updated on Oct 16 2018 6:27 PM

ఆధిపత్య పోరాటం - Sakshi

ఆధిపత్య పోరాటం

ఎమ్మెల్యే మీసాల గీత, మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ మధ్య ఆసక్తి కర పోరు నడుస్తోంది. వీరి అంతర్గత పోరుతో విజయనగరం టీడీపీ నాయకులు రెండు గ్రూపులుగా విడిపోయారు.

మున్సిపల్ చైర్మన్ x ఎమ్మెల్యే  
పంపకాల కోసమే!
ఆసక్తికరంగా మున్సిపల్ రాజకీయం
సాక్షి ప్రతినిధి, విజయనగరం : ఎమ్మెల్యే మీసాల గీత, మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ మధ్య ఆసక్తి కర పోరు నడుస్తోంది. వీరి అంతర్గ త పోరుతో విజయనగరం  టీడీపీ నాయకులు రెండు గ్రూపులుగా విడిపోయారు. ఆధిపత్యం, పంపకాల కోసం పాకులాడుతున్నారు. ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఎమ్మెల్యేగా తనకు గౌరవమివ్వడం లేదని మీసాల గీత, మున్సిపాల్టీ లో ఎమ్మెల్యే జోక్యమేంటని చైర్మన్ రామకృ ష్ణ విభేదించుకుంటున్నారు. సోమవారం అశోక్ బంగ్లా వేదికగా జరిగిన పార్టీ సమావేశం లో కూడా ఇదే ప్రస్తావనకు వచ్చింది.

ఎన్నికల కు ముందు మం జూరైన స్పెషల్ డెవలప్‌మెంట్ పనులు, బీఆర్‌జీ ఎఫ్ పనులు, జనరల్ ఫండ్స్ పనుల విషయంలో  ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ మధ్య తొలుత అభిప్రాయబేధాలొచ్చాయి. ఆ తర్వాత పారిశుద్ధ్య, లైటింగ్ కాంట్రాక్ట్‌ల విషయంలో మనస్పర్థలొచ్చాయి. ఇప్పుడు ఏకంగా ఆధిపత్యం,పంపకాల కోసం పోరు నడుస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఎన్నికల ముందు మంజూరైన సివిల్ వర్కులను అప్పటికే ఖరారైన కాంట్రాక్టర్లతోనే చేపట్టాలని ఓ వర్గం, వారిని రద్దు చేసి కొత్తవారికి ఇవ్వాలని మరో వర్గం పట్టుబట్టింది. దీంతో ఆ పనులు సంది గ్ధంలో పడ్డాయి. చివరకు పెద్దల జోక్యం మేర కు ఒక నిర్ణయానికొచ్చారు. ఇంకేముంది పనుల పంపకాల పర్వం కొనసాగింది. అయి తే, ఇందులో తమ వర్గానికి తక్కువ ఇచ్చారని  ఓ వర్గం వాదనకు దిగింది. ఇదే విషయంలో కొంతమంది కౌన్సిలర్లు రచ్చకెక్కారు.
 
ఇక పారిశుద్ధ్యం, లైటింగ్ కాంట్రాక్ట్ విషయంలో ఎమ్మెల్యేను కనీసం సంప్రదించకుం డా చైర్మన్ ఖరారు చేసేసారని  ఎమ్మెల్యే వర్గం గుర్రుగా ఉంది. అపాయింట్‌మెంట్ కమిటీ నియామకంలో, టీచర్ల బదిలీల్లో కూడా ఎమ్మెల్యేను విస్మరించారని, ఆమెకు తెలియకుండా నే నడిపించేసారని ఆ వర్గీయులు అసంతృప్తి తో ఉన్నారు. ఇక, షిప్ట్ ఆపరేటర్ల పోస్టులను, అంగన్ వాడీ పోస్టుల విషయంలో టీడీపీ కార్యకర్తలకు కాకుండా వేరే వ్యక్తులకు ముడుపులు తీసుకుని కట్టబెడుతున్నారని ఎమ్మెల్యే వర్గంపై మరో వర్గం కస్సుమంటోంది.

టీడీపీ కార్యకర్తలకిస్తే డబ్బులు రావనే ఉద్దేశంతోనే ఈ పనిచేస్తున్నట్టు మరో వర్గం కౌన్సిలర్లు మండి పడుతున్నారు.  ఇలాంటి ఆరోపణలు, మనస్పర్థలు, అభిప్రాయాలు కొనసాగుతున్న  నేపథ్యంలో సోమవారం అశోక్ బంగ్లాలో ఎమ్మెల్యే మీసాల గీత, మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ,  వ కౌన్సిలర్లు, పట్టణ టీడీపీ నాయకులతో సమావేశం జరిగింది. మంగళవారం జరగనున్న,  మున్సిపల్ సాధారణ సమావేశంలో పార్టీ కౌన్సిలర్లు వ్యవహరించే విషయమై చర్చించేందుకు సమావేశమయ్యారు. అయితే, ఈ సమావేశం వాడీ, వేడీగా సాగింది.

మున్సిపల్ సమావేశంలో ప్రతిపక్ష కౌన్సిలర్లు నిలదీసే విధంగా కొంద రు టీడీపీ నాయకులు అటు ఎమ్మెల్యేను, ఇటు మున్సిపల్ చైర్మన్‌ను నిలదీసినట్టు తెలిసింది. ముఖ్యంగా మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణను కాస్త ఎక్కువగా ప్రశ్నించినట్టు సమాచారం. కాంట్రాక్ట్ కమిటీ, అపాయింట్‌మెంట్ కమిటీ నియామకాల్లో నూ, టీచర్ల బదిలీలను తనకు తెలియకుండా చేసారని ఎమ్మెల్యే గీత ప్రశ్నించినట్టు తెలిసిం ది. అలాగే, ఒక అటెండర్ ద్వారా ఒక రోజు ముందు మున్సిపల్ సమావేశం అజెండా నోటీసును పంపించడమేంటని చైర్మన్‌ను నిల దీసినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలియవచ్చింది.

అలాగే మరికొంతమంది కౌన్సిలర్లు ప్రసాదుల రామకృష్ణను లక్ష్యంగా చేసుకుని ఏకరు వు పెట్టారు. కో ఆప్షన్ సభ్యుల నియామకా ల్లో తమ అభిప్రాయాలను ఎందుకు తీసుకోలేదని, పైడితల్లి ఉత్సవాల కమిటీ ఏర్పాటులో కౌన్సిలర్లు అభిప్రాయం తెలుసుకోలేదని, మీ ఆదేశాలో, అండదండలో తెలియదు గాని  మున్సిపల్ అధికారులు, ఉద్యోగులు తమను ఏమాత్రం పట్టించుకోవడం లేదని, పట్టణం లో  పారిశుద్ధ్యం, లైటింగ్ అధ్వాన్నంగా ఉంద ని చైర్మన్ నుద్దేశించి ధ్వజమెత్తారు. అయితే, దీనికి ప్రసాదుల రామకృష్ణ కూడా సీరియస్ గా స్పందించినట్టు తెలిసింది.

అశోక్ గజపతి రాజుకి తప్ప తానెవ్వరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని స్పష్టం చేసారు. దీనిపై పలువురు కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేసారు. తాము ఓటు వేస్తేనే చైర్మన్ అయ్యారన్న విషయాన్ని గుర్తించుకోవాలని ప్రతివాద న చేశారు. మొత్తానికి పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశం అంతర్గత విబేధాల చర్చ కు వేదికైంది. ఇదిలా ఉండగా, రెండు గ్రూపులగా విడిపోయిన కౌన్సిలర్లు తమకున్న అండ తో తోచిన విధంగా దందా నడుపుతున్నారు. వైన్ షాపుల్లో వాటాలు, ప్రభుత్వ స్థలాల్లో కొనసాగుతున్న దుకాణదారుల నుంచి మామూళ్లు, ఆక్రమణలు తొలగించకుండా ముడుపులు డిమాండ్ చేస్తూ రోడ్డెక్కుతున్నా రు. ప్రస్తుతం పట్టణంలో ఇదొక చర్చ నడుస్తోంది. కాసుల కోసం పదవులు అలంకరించిన దగ్గరి నుంచే దండుకోవడం మొదలు పెట్టారని విమర్శలు గుప్పు మంటున్నాయి.  దీన్నిబట్టి ఆ పార్టీలో గ్రూపులు ఏమేరకు నడుస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement