పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య

Mother Has Committed Suicide - Sakshi

ఓ చిన్నారి, తల్లి మృతి

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కుమార్తె

సాక్షి, కలిదిండి (కైకలూరు) : మండలంలోని పోతుమర్రు పంచాయతీ శివారు పరమానందునిపేటలో ఆదివారం ఓ గృహిణి తన ఇద్దరి పిల్లలతోపాటు పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఈ ప్రాంతంలో కలకలం రేపింది. ఈ ఘటనలో గృహిణి, ఓ చిన్నారి మృతి చెందగా, మరో బాలిక భీమవరం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.

 
కట్టా త్రిమూర్తులు భార్య అశ్విని (27) తన ఇద్దరి పిల్లలు కట్టా శర్వాణి (3), కట్టా కిరణ్‌ (1) లకు మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఇంట్లోనే పురుగు మందు పోసి తనూ తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ప్రమాదాన్ని గ్రహించిన కుటుంబీకులు ముగ్గురిని కైకలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా అశ్విని, కిరణ్‌ ప్రాణాలు కోల్పోగా శర్వాణి చికిత్స పొందుతోంది. ఇరుగు పొరుగు కథనం ప్రకారం కుటుంబ కలహాల వల్ల అశ్విని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. గుడివాడ పట్టణంలోని బేతవోలుకు చెందిన అశ్వినికి త్రిమూర్తులుతో ఐదేళ్ల క్రితం వివాహమైంది.

తన అత్తతో అశ్వినికి మనస్పర్థలు ఉన్నాయి. ఇటీవల కుమారుడు కిరణ్‌ బర్త్‌డే కూడా చేశారు. అయితే, అత్తాకోడళ్ల గొడవ వల్ల అశ్విని ఆత్మహత్యకు పాల్ప డిందని సమాచారం. త్రిమూర్తులు అన్న గోవర్థన్‌ గుడివాడలో కానిస్టేబుల్‌గా పని చేస్తాడని, వాస్తవాలు నమోదు చేయడంలో పోలీసులు వెనుకాడవచ్చని పలువురు అనుమానిస్తున్నారు. కలిదిండి ఎస్‌ఐ వై.సుధాకర్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top