=ఎర్రచందనం చెట్లను నరకక ముందే అడ్డుకుంటాం
=త్వరలో రెండంచెలుగా ఎర్రచందనం వేలం
=‘సాక్షి’తో అటవీశాఖ కన్సర్వేటర్ రవికుమార్
సాక్షి, తిరుపతి: వేలాది ఎకరాల్లో విస్తరించి ఉన్న శేషాచల అడవుల్లోంచి ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు మరి న్ని బేస్క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామని కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ రవికుమార్ తెలిపారు. దీని ద్వారా అడవిలో చెట్లను నరకక ముందే ఎర్రచందనం కూలీలను పట్టుకోవచ్చన్నారు. ఆయన శుక్రవారం ‘సాక్షి’తో మాట్లాడారు.
ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన వారికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించేలా, జరిమానాను లక్ష నుంచి పది లక్షల రూపాయల వరకు విధించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని చెప్పారు. ఎర్ర కూలీలకు డబ్బు ఆశ చూపించి తీసుకుని వస్తున్నారన్నారు. రోజుకు వెయ్యి రూపాయలు కూలీ ఇస్తున్నారని, ఒక వేళ పట్టుబడినా, వదిలి పెట్టేస్తున్నారనే ఉద్దేశంతో ఎక్కువ మంది కూలీలు వస్తున్నారన్నారు. కఠిన శిక్షలు అమలు చే స్తే ఎర్రకూలీలు వచ్చేందుకు జంకుతారన్నారు.
నిల్వ ఉన్న ఎర్రచందనం త్వరలో వేలం
వివిధ సందర్భాల్లో పట్టుబడిన ఎర్రచందనం దుంగలను త్వరలోనే వేలం వేస్తామన్నారు. తమవద్ద ఐదువేల టన్నుల ఎర్రచందనం నిల్వ ఉందని, దీనిని రెండు దఫాలుగా వేలం వేస్తామని చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లో ఎర్రచందనం ఏడాదికి రెండు వేల టన్నుల అవసరం ఉందన్నారు. తమ వద్ద ఉన్న ఐదువేల టన్నులను వేలం వేయడం ద్వారా అక్రమ రవాణా తగ్గే అవకాశం ఉందన్నారు.
నెలకు సరాసరి 70 నుంచి వంద టన్నుల ఎర్రచందనం పట్టుబడుతోందని చెప్పారు. ప్రతి రోజూ దాదాపు 80 మంది టాస్క్ఫోర్సు సిబ్బంది కూంబింగ్ ఆపరేషన్లో పాల్గొంటున్నారని తెలిపారు. 40 బేస్ క్యాంపులను ఏర్పాటు చేశామని వీటిల్లో 200 మందికి పైగా ఉన్నారన్నారు. దీంతో ఎర్ర కూలీలు అడవి లోపలికి వెళ్లలేకున్నారని తెలిపారు. అప్పుడప్పుడు వారు అసహనంతో సిబ్బందిపై దాడికి దిగుతున్నారని అటువంటి సమయంలో వారిని ఎదుర్కొనేందుకు పోలీసుల సాయం తీసుకుంటున్నామన్నారు.
తిరుపతి అర్బన్, చిత్తూరు ఎస్పీల సహకారంతో ఎర్రచందనం అక్రమ రవాణాను పూర్తిగా అడ్డుకోగలుగుతున్నామని చెప్పారు. ఎర్ర చందనం స్మగ్లర్లను అడ్డుకునేందుకు ఏడాదికి రూ.3.5 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నామన్నారు. ఎర్రచందనం వేలం ప్రారంభమయితే, అక్రమ రవాణా పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.
మరిన్ని బేస్ క్యాంపులు
Published Sat, Nov 23 2013 1:57 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రూపురేఖలు మారాయి
అగ్రి ల్యాబ్ ఎంతో ప్రయోజనం
● ప్రగతి పథంలో దూసుకుపోతున్న గ్రామాలు ● పరుగులు పెడుతున్న అభివృద్ధి పనులు ● వెల్లివిరుస్తున్న ప్రభుత్వ భవనాలు ● నాడు–నేడుతో సమూలంగా మారిన సర్కారు బడులు ● ఇళ్లు కాదు.. ఊళ్లుగా వెలిసిన జగనన్న కాలనీలు ● అబ్బో..! ఎటు చూసినా నయా మెరుగులే!
మతిస్థిమితం లేని వ్యక్తి అదృశ్యం
రేపు, ఎల్లుండి కూడా పోస్టల్ బ్యాలెట్
రోబోటిక్ టెక్నాలజీతో మోకాలి మార్పిడి శస్త్రచికిత్స
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన మరో లారీ
అబ్బో.. ఆ యువ నాయకుడితో ఎట్టా ఏగేది?
బూటకాల ‘బాబు’
వైఎస్సార్సీపీ జోష్
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement