టీచర్ ఎమ్మెల్సీ ఓటింగ్ కౌంటింగ్ కేంద్రంలో గందరగోళం నెలకొంది.
ఎమ్మెల్సీ కౌటింగ్లో గందరగోళం
Mar 20 2017 9:37 PM | Updated on Aug 29 2018 6:26 PM
అనంతపురం: టీచర్ ఎమ్మెల్సీ ఓటింగ్ కౌంటింగ్ కేంద్రంలో గందరగోళం నెలకొంది. వైఎస్ఆర్సీపీ, టీడీపీ కౌంటింగ్ ఏజెంట్ల మధ్య వాగ్వాదం తలెత్తడంతో కౌటింగ్ కేంద్రం వద్ద కొద్ది సేపు గందరగోళం చోటుచేసుకుంది.
వైఎస్ఆర్సీపీ ఏజెంట్ విశ్వేశ్వరరెడ్డి ఓట్ల లెక్కింపుపై అభ్యంతరం వ్యక్తం చేయడంలో రెండు పార్టీల మధ్య వివాదం సంభవించింది. విశ్వేశ్వరరెడ్డిని పోలీసులు లాక్కెళ్లడంతో వివాదం కాస్త పెద్దదైంది. దీంతో రంగంలోకి దిగిన ఎన్నికల అధికారులు పరిస్ధితిని చక్కదిద్ది తిరిగి కౌంటింగ్ కొనసాగించారు.
Advertisement
Advertisement