పార్టీ నాయకులతో కమిటీలా? | mla amarnath reddy slams tdp government | Sakshi
Sakshi News home page

పార్టీ నాయకులతో కమిటీలా?

Sep 22 2014 8:14 PM | Updated on May 10 2018 12:34 PM

పార్టీ నాయకులతో కమిటీలా? - Sakshi

పార్టీ నాయకులతో కమిటీలా?

టీడీపీ ప్రభుత్వం వంద రోజుల్లో ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేయకపోగా, అన్నింటికీ పార్టీ నాయకులతో కమిటీలు వేస్తోందని పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి విమర్శించారు.

చిత్తూరు: టీడీపీ ప్రభుత్వం వంద రోజుల్లో ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేయకపోగా, అన్నింటికీ పార్టీ నాయకులతో కమిటీలు వేస్తోందని పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి విమర్శించారు. ఎలాంటి నిబంధనలు లేకుండా మహిళలు, రైతుల రుణాలు మాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఫించన్లు బాగా తగ్గించి లబ్దిదారులను ఇబ్బందుల పాల్జేయడం లక్ష్యంగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ఇన్ని సమస్యలతో జన్మభూమి-మాఊరు కార్యక్రమానికి వెళ్తే ప్రజలే తిరస్కరిస్తారని అమర్నాథరెడ్డి హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement