breaking news
palamaner mla
-
'30 సంవత్సరాలుగా రౌడీయిజం చేస్తున్నదెవరో అందరికీ తెలుసు'
సాక్షి, చిత్తూరు: కుప్పంలో అధికార పార్టీ అభ్యర్థులకు మంచి ప్రజాదరణ లభిస్తుంటే టీడీపీ కనీస ఆదరణకు నోచుకోలేకపోతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కుప్పం ప్రచారంలో వైఎస్సార్సీపీ దూసుకుపోతోంది. కుప్పం మున్సిపాల్టీని వైఎస్సార్సీపీ కైవసం చేసుకోవడం ఖాయం. కుప్పంలో ఎవరినీ అరెస్ట్ చేయలేదు. ఓటమి భయంతనే టీడీపీ అవాస్తవాలు ప్రచారం చేస్తోంది. టీడీపీ అవాస్తవ ప్రచారాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరు. కుప్పంలో 30 సంవత్సరాలుగా ఎవరు రౌడీయిజం చేస్తున్నారో అందరికీ తెలుసు. మున్సిపల్ కమిషనర్ మీద దాడి చేసిన ఘనత టీడీపీది. ఇప్పుడు చంద్రబాబు కల్లిబొల్లి కబుర్లు చెప్తున్నాడు. కుప్పంలో ప్రశాంత వాతావరణం ఉంది. స్వేచ్ఛగా వైఎస్సార్సీపీ, టీడీపీ ప్రచారం చేసుకుంటున్నాయి. ప్రజల తీర్పును గౌరవిస్తాం. ఎన్నికల ఫలితాలు వచ్చే 15వ తేదీ వరకు వేచి ఉండండి. ఇప్పటి నుంచే అనవసరమైన గొడవలు చేయకండి. కుప్పం ప్రజల తీర్పు వైఎస్సార్సీపీకే ఉంటుంది అని ఎంపీ మిథున్రెడ్డి అన్నారు. దమ్ముంటే సవాల్ స్వీకరించు: పలమనేరు ఎమ్మెల్యే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోతే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.. టీడీపీ ఓడిపోతే కుప్పం తిరుపతి గంగమ్మ ఆలయం వద్ద క్షమాపణ చెప్తావా అంటూ టీడీపీ మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డికి పలమనేరు ఎమ్మెల్యే వెంకటే గౌడ సవాల్ విసిరారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. దమ్ముంటే సవాల్ స్వీకరించు. ఈ రోజు సాయంత్రం వరకు ఎదురు చూస్తూ ఉంటా. సీఎం వైఎస్ జగన్, మంత్రి పెద్దిరెడ్డిలు మాకు శాంతియుతంగా ప్రచారం చేయమని చెప్పారు. టీడీపీ మాత్రం అరాచకాలకు పాల్పడుతోంది. ప్రజలే గుణపాఠం చెబుతారు అని ఎమ్మెల్యే వెంకటే గౌడ అన్నారు. చదవండి: (‘చంద్రబాబు అంటేనే గూండాగిరి రాజకీయాలకు పెట్టింది పేరు’) -
'మా ఓటు మాకు తిరిగిచ్చేసి.. పార్టీ మారండి'
చిత్తూరు : టీడీపీలోకి వలస వెళ్లిన చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్రెడ్డిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మండిపడుతున్నారు. వీ. కోట మండల కేంద్రంలో అమర్నాథ్ రెడ్డికి వ్యతిరేకంగా ఓ బ్యానర్ను పార్టీ కార్యకర్తలు శుక్రవారం ప్రదర్శించారు. ఆ బ్యానర్లో ఏముందంటే... ఆ రోజు పార్టీలోకి ఎవరూ మిమ్మల్ని రమ్మనలేదు... అలాగే ఈ రోజు మీరు వెళతానంటే ఎవరూ ఆపేది లేదని.. కానీ మిమ్మల్ని మేము ఓట్లు వేసి గెలిపించింది మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అని గుర్తుంచుకోండన్నారు. అమర్నాథ్రెడ్డి గారు మీరు పార్టీ మారతారో లేక గంగలో దూకుతారో మీ ఇష్టం... కానీ మా ఓటు మాకు తిరిగిచ్చేసి పార్టీ మారండి... ఓటర్లుగా మాకు విలువ వుంది. ఓటుకు కూడా ఎంతో విలువ ఉంది. తరచూ పార్టీలు మారే ఎంఎల్ఏగా మీకు విలువుందా ? అని బ్యానర్ ద్వారా ప్రశ్నించారు. సిగ్గు... సిగ్గు.. అని బ్యానర్లో రాసి ఉంది. -
పార్టీ నాయకులతో కమిటీలా?
చిత్తూరు: టీడీపీ ప్రభుత్వం వంద రోజుల్లో ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేయకపోగా, అన్నింటికీ పార్టీ నాయకులతో కమిటీలు వేస్తోందని పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి విమర్శించారు. ఎలాంటి నిబంధనలు లేకుండా మహిళలు, రైతుల రుణాలు మాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఫించన్లు బాగా తగ్గించి లబ్దిదారులను ఇబ్బందుల పాల్జేయడం లక్ష్యంగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ఇన్ని సమస్యలతో జన్మభూమి-మాఊరు కార్యక్రమానికి వెళ్తే ప్రజలే తిరస్కరిస్తారని అమర్నాథరెడ్డి హెచ్చరించారు.