గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం | missing person dead body found in tungabadra river in kurnool district | Sakshi
Sakshi News home page

గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం

Aug 3 2015 7:34 AM | Updated on Sep 3 2017 6:43 AM

తుంగభద్ర దిగువ కాలువలో స్నానానికి దిగి గల్లంతైన మద్దిలేటి(35) అనే వ్యక్తి మృతదేహం లభ్యమైంది.

కర్నూలు: తుంగభద్ర దిగువ కాలువలో స్నానానికి దిగి గల్లంతైన మద్దిలేటి(35) అనే వ్యక్తి మృతదేహం సోమవారం ఉదయం 6 గంటలకు లభ్యమైంది. కొడుమూరు కర్నూలు బ్రాంచి కెనాల్ వద్ద మృతదేహన్ని కనుగొన్నారు. ఆదివారం సాయంత్రం మద్దిలేటి తన స్నేహితులతో కలిసి గాజులదిన్నె ప్రాజెక్టు సమీపంలో పార్టీ చేసుకున్నాడు.

అనంతరం స్నానం చేద్దామని కాలువలోకి దిగగా..ప్రమాదవశాత్తూ కొట్టుకుపోయాడు. స్నేహితులంతా కలిసి నిన్నటి నుంచి వెతకటం ప్రారంభించటంతో సోమవారం ఉదయం అతని శవం బయటపడింది.

Advertisement
 
Advertisement
Advertisement