రసాభాస | Meet confusing ZP | Sakshi
Sakshi News home page

రసాభాస

Sep 1 2014 3:57 AM | Updated on Apr 3 2019 5:55 PM

రసాభాస - Sakshi

రసాభాస

జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. సమావేశంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది. సమస్యలను ప్రస్తావించిన వైఎస్‌ఆర్ సీపీ జెడ్పీటీసీ సభ్యులపై అధికారపార్టీ సభ్యులు మూకుమ్మడిగా....

  • గందరగోళంగా జెడ్పీ మీట్
  •  సమస్యలు ప్రస్తావించిన వైఎస్‌ఆర్ సీపీ సభ్యులపై అధికార పార్టీ దౌర్జన్యం
  •  అడుగడుగునా అడ్డగింపులు
  •  జెడ్పీ చరిత్రలో తొలిసారిగా పోలీసుల రంగప్రవేశం
  •  సభ్యులుకానివారు సభలోకొచ్చి వీరంగం సృష్టిస్తున్నా పట్టించుకోని అధికారులు
  •  అర్ధాంతరంగా ముగిసిన సమావేశం
  • చిత్తూరు (టౌన్): జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. సమావేశంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది. సమస్యలను ప్రస్తావించిన వైఎస్‌ఆర్ సీపీ జెడ్పీటీసీ సభ్యులపై అధికారపార్టీ సభ్యులు మూకుమ్మడిగా ఎదురుదాడికి దిగడంతో దాన్ని ప్రతి ఘటించే క్రమంలో సభ ఆద్యంతం అరుపులు, కేకలు, వాగ్వాదాలు, తోపులాటల మధ్య సాగింది. అధికారపార్టీ సభ్యులకు మద్దతుగా సభ్యులు కానివారు సభలోకొచ్చి టీడీపీ సభ్యులకు మద్దతిచ్చేలా నినాదాలు చేస్తున్నా నిలువరించాల్సిన జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ సైతం చూస్తూ మిన్నకుండి పోయారు. దీంతో మంత్రి, ఇన్‌చార్జి కలెక్టర్ పాల్గొన్న సభలో మహిళలని కూడా చూడకుండా వైఎస్‌ఆర్ సీపీ మహిళా సభ్యులపై అధికారపార్టీ సభ్యులు అప్రజాస్వామ్యంగా వ్యవహరించి, వారి హక్కులను హరింపజేసేవిధంగా వ్యవహరిం చారు.

    దీంతో సభ ప్రారంభమైనప్పటి నుంచి ముగిసేవరకు అరుపులు, కేకలు, వాగ్వాదాలతోనే కొనసాగింది. సభలో పాల్గొన్న మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అధికారపార్టీ సభ్యులకు మద్దతిచ్చే విధంగానే వ్యవహరించారు. దీంతో వైఎస్‌ఆర్ సీపీ సభ్యులు, వారికి మద్దతుగా ఆ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు గొంతుకలపడంతో విధిలేక అధికారపార్టీ సభ్యులు కొంత వెనక్కి తగ్గారు. జెడ్పీ మీటింగ్ హాలులో ఆదివారం జెడ్పీ చైర్‌పర్సన్ గీర్వాణి అధ్యక్షతన జిల్లాపరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది.

    అయితే ఇది తొలిసమావేశం కావడంతో జరగాల్సిన సమయాని కన్నా కొంత ఆలస్యంగా జరిగింది. సభ ప్రారంభంలోనే పలమనేరు ఎమ్మెల్యే అమరనాథరెడ్డి కల్పించుకుని జిల్లాలోని పడమటి ప్రాంతాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. దీని పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని చైర్‌పర్సన్‌ను కోరారు. ఇంతలోనే అధికారపార్టీ జెడ్పీటీసీ సభ్యులు పలువురు కల్పించుకుని అజెండా ప్రకారం సభను జరిపించాలని పట్టుబట్టారు. ఇంతలో పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ తమ నియోజకవర్గంలో తా గునీటి సమస్య తీవ్రంగా ఉందని, గొంతెండుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు.

    దీంతో అధికార పార్టీ సభ్యులు ఎదురుదాడికి దిగుతూ ఎమ్మెల్యే ఏమి మాట్లాడుతున్నారో వినిపించకుండా ఇస్టానుసారంగా అరవడం మొదలుపెట్టారు. దీంతో మంత్రి కల్పించుకుని వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యేల దగ్గరున్న మైకులను తీసేసుకోండంటూ సిబ్బందిని ఆదేశించారు. దీంతో వైఎస్‌ఆర్ సీపీ సభ్యుల నుంచి కూడా నిరసనలు ఎదురయ్యాయి. పీలేరు, చంద్రగిరి ఎమ్మెల్యే లు కల్పించుకుని తమ గొంతులు నొక్కేస్తారా అంటూ మంత్రిని ప్రశ్నించారు. అయినా మంత్రి నుంచి పెద్దగా స్పందన కనిపించలేదు.

    దీంతో చంద్రగిరి, పలమనేరు ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, అమరనాథరెడ్డి క ల్పించుకుని మంత్రిగారే చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తుంటే ఎలా అని ప్రశ్నించారు. తాము రాజకీయాలు చేసేందు కు ఇక్కడకు రాలేదని, నిధుల మంజూరులో తమ జెడ్పీటీసీ సభ్యులున్న ప్రాంతాలకు వివక్ష చూపారని ప్రశ్నిం చడానికి వచ్చామన్నారు. సమస్యలపై మాట్లాడితే కూ డా తప్పంటే మరి మమ్మల్ని సమావేశాలకు ఎందుకు ఆహ్వానించారంటూ ప్రశ్నించారు. ఇంతలో అధికారపార్టీ సభ్యులు అడ్డుపడి అరుపులకు దిగడంతో మళ్లీ సభలో గందరగోళం నెలకొంది.

    దీంతో మంత్రి జోక్యం చేసుకుని ఇది తొలిమీటింగ్ ఇలాగయితేఎలా, మీరు గొడవకనే వచ్చినట్టున్నారు, దానికోసమే వచ్చినట్టుం టే బయటకు వెళ్లి అరుచుకోండంటూ అసహనాన్ని వ్యక్తం చేశారు. అయినా పరిస్థితి సర్దుబాటు కాకపోవడంతో ‘సీఈవో గారు..ఇద్దరు ముగ్గురిని సస్పెండ్ చేయకపోతే పరిస్థితి సర్దుబాటు కాదు, సభ సజావుగా జరగదు, వీరిలో కొందరినైనా సస్పెండ్ చేయండి’ అంటూ ఆదేశించారు. దాంతో అప్పటివరకు మౌనంగా ఉన్న నగరి, చంద్రగిరి ఎమ్మెల్యేలు రోజా, చెవిరెడ్డి భాస్కర్ కల్పించుకుని సభ్యుల వద్ద కెళ్లి పరిస్థితిని సర్దుబాటు చేశారు. దీంతో సభ కొంత సర్దుబాటైంది.

    ఇంత లో మళ్లీ మంత్రి జోక్యం చేసుకుని ‘మాకు తెలుసు సభ ను ఎలా నిర్వహించాలో’ అని వ్యంగ్యంగా అనడంతో సభ మధ్యలో కూర్చుండిన వైఎస్‌ఆర్ సీపీ సభ్యులు చేతిలోని వాటర్‌బాటిళ్లను చూపుతూ తమకు నీళ్లు కావా లి, అందరితో సమానంగా తమకూనిధులివ్వండని గట్టిగా అరవడంతో వారి అరుపులు వినబడకుండా అధికారపార్టీ సభ్యులు కూడా అరుపులకు దిగడంతో  ఇరుపార్టీల సభ్యుల మధ్య వాగ్వాదం పెరిగి తోపులాట లవరకు దారితీసింది. కొందరు బల్లలు గుద్దడం, అం తా గుమికూడడంతో సభలో ఏమి జరుగుతోందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి నెలకొంది.

    పరిస్థితి అదుపుతప్పుతుందని గుర్తించిన మంత్రి పోలీసులను పిలిపిం చండని పక్కనే వున్న ఇన్‌చార్జి కలెక్టర్ శ్రీధర్‌కు చెప్పడంతో ఆయన డీఎస్పీ..డీఎస్పీ అంటూ పలుమార్లు పిలిచినా ఎవరూ లోపలికి రాలేదు. చివరికి టూటౌన్ సీఐ రాజశేఖర్ ఒకరిద్దరు ఎస్‌ఐలు, సిబ్బందితో లోపలికొచ్చి సభ్యులను వారివారి సీట్ల వద్దకు పంపారు. ఇలా ఆరేడుసార్లు సభలో వైఎస్‌ఆర్ సీపీ, అధికారపార్టీ సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదాలు చోటుచేసుకోవడంతో తోపులాటల వరకు దారితీసింది.

    అయితే గొడవలను సర్దుబాటు చేయాల్సిన మంత్రి తాము ప్రతిపక్షంలో ఉన్నపుడు ఇలాగే సమస్యలను ఎదుర్కొన్నాం, ఇప్పుడు మీకూ పదేళ్లపాటు తప్పదు అంటూ పదేపదే చెప్పడంతో వైఎస్‌ఆర్ సీపీ సభ్యులపై అధికారపార్టీ సభ్యులు దూకుడు పెంచారు. సమావేశం ముగిసే సమయంలో గంగధరనెల్లూరు ఎంపీపీ ప్రగతీకరుణాకర్ మాట్లాడేందుకు మైకు తీసుకోగా ఆమెను మాట్లాడనివ్వకుండా 15 నిమిషాలపాటు అడ్డుపడ్డారు. ఇంతలో వైఎస్‌ఆర్‌సీపీ సభ్యులు ఆమెకు మద్దతివ్వగా అధికారపార్టీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు.

    ఇంతలో సభ్యులుకాని అధికారపార్టీకి చెందిన వ్యక్తులు లోపలికొచ్చి మంత్రి, ఇన్‌చార్జి కలెక్టర్, జెడ్పీ చైర్‌పర్సన్‌లు కూర్చొని ఉన్న వేదికపెకైక్కి పదేళ్లు మీకిది తప్పదు, మేము చెప్పిందే జరుగుతుంది, మాదే రాజ్యం అంటూ నినాదాలు చేశారు. దాంతో గంగాధరనెల్లూరు ఎంపీపీ కంటతడిపెట్టినా మంత్రికాని, ఇన్‌చార్జి కలెక్టర్ కాని అధికారపార్టీ సభ్యులను, బయటి వ్యక్తులను వారించలేకపోయారు. చివరకు అజెండాలోని పది అంశాలపై చర్చ జరగకుండానే సభను ముగిస్తున్నట్లు చైర్‌పర్సన్ ప్రకటించి వెళ్లిపోయారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement