విశాఖలో మావోయిస్టు లేఖల కలకలం | Sakshi
Sakshi News home page

విశాఖలో మావోయిస్టు లేఖల కలకలం

Published Thu, Aug 20 2015 5:03 PM

Maoists letter to warn over Bauxite Mining in Vizag

గూడెం కొత్తవీధి (విశాఖపట్నం) : బాక్సైట్ తవ్వకాలకు మద్దతిచ్చిన వారికి ప్రజాకోర్టులో శిక్ష తప్పదని మావోయిస్టులు చేసిన హెచ్చరికలు విశాఖ జిల్లాలో కలకలం రేపాయి. ఈ మేరకు కోరుకొండ ఏరియా కమిటీ పేరుతో గురువారం పత్రికా ప్రతినిధులకు లేఖలు అందాయి.

బాక్సైట్ తవ్వకాలకు అనుకూలంగా పనిచేస్తున్న పునరావాస కమిటీ సభ్యులు వారంలోగా ప్రజాకోర్టులో లొంగిపోవాలని ఆ లేఖలో పేర్కొన్నారు. లేకుంటే వారి కుటుంబసభ్యులే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించాల్సి వస్తుందని పేర్కొన్నారు. కాగా దీనిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement
Advertisement