‘కురుక్షేత్రం’ జరిగి తీరుతుంది.. | Mandha Krishna Madhiga about Kurukshetra Mahasabha | Sakshi
Sakshi News home page

‘కురుక్షేత్రం’ జరిగి తీరుతుంది..

Jul 10 2017 6:46 AM | Updated on Oct 9 2018 5:22 PM

‘కురుక్షేత్రం’ జరిగి తీరుతుంది.. - Sakshi

‘కురుక్షేత్రం’ జరిగి తీరుతుంది..

కురుక్షేత్ర మహాసభను నిర్వహించి తీరుతామని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ స్పష్టం చేశారు.

ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు కృష్ణమాదిగ
 
నయీంనగర్‌(వరంగల్‌): కురుక్షేత్ర మహాసభను నిర్వహించి తీరుతామని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ స్పష్టం చేశారు. హన్మకొండలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో జరగాల్సిన కురుక్షేత్ర సభను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంకుశంగా అడ్డుకున్నారని విమర్శించారు. తాము సభ నిర్వహించాలనుకున్న స్థలంలో పోలీసులను మోహరింపజేశారని.. దీంతో తాము ఎక్కడ ఉండాలో తెలియలేదన్నారు.

తెలంగాణలో చంద్రబాబు పాదయాత్రకు తాము సహకరించినా.. ఆయన మరిచిపోయారని ఆరోపించారు. మాదిగల సహకారంతోనే ఏపీలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు వర్గీకరణకు సహకరించడం లేదని పేర్కొన్నారు. ఏదేమైనా విజయవాడ–గుంటూరు మధ్యలో కురుక్షేత్ర సభ నిర్వహించేందుకు హైకోర్టు నుండి అనుమతి రాగానే తేదీ ప్రకటిస్తామని మంద కృష్ణ వెల్లడించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement