తేనెటీగల దాడి నుంచి తప్పించుకోబోయి... | Man killed by lorry in antapur district | Sakshi
Sakshi News home page

తేనెటీగల దాడి నుంచి తప్పించుకోబోయి...

Feb 6 2015 10:59 AM | Updated on Aug 29 2018 8:36 PM

తేనెటీగల దాడి నుంచి తప్పించుకోబోయి... - Sakshi

తేనెటీగల దాడి నుంచి తప్పించుకోబోయి...

తేనెటీగల దాడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఓ యువకుడు మినీ లారీ కింద పడి మరణించాడు.

అనంతపురం: తేనెటీగల దాడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఓ యువకుడు మినీ లారీ కింద పడి మరణించాడు. ఆ ఘటన అనంతపురం జిల్లా పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామ సమీపంలోని రహదారిపై చోటు చేసుకుంది. నారాయణరెడ్డిపల్లెకు చెందిన జయచంద్ర కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

అయితే శుక్రవారం ఉదయం ఎల్లుట్ల - మడ్డిపల్లి రోడ్డు సమీపంలో ట్రాక్టర్లో రాళ్లు నింపడానికి వెళ్లాడు. ఆ సమయంలో పక్కనే ఉన్న తేనెతుట్టే కదిలి...జయచంద్రపై  దాడీ చేశాయి. దాంతో పారిపోయే క్రమంలో రోడ్డుపైకి వేగంగా పరిగెత్తాడు. అంతలో వేగంగా వస్తున్న మీని లారీ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement