ప్రజాగర్జనను విజయవంతం చేయండి | Make prajagarjananu Success | Sakshi
Sakshi News home page

ప్రజాగర్జనను విజయవంతం చేయండి

Apr 5 2014 3:33 AM | Updated on Aug 11 2018 4:02 PM

ఈనెల 7వ తేదిన కడపలో నిర్వహించే టీడీపీ ప్రజాగర్జనను విజయవంతం చేయాలని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ తెలిపారు.

కడప రూరల్, న్యూస్‌లైన్: ఈనెల 7వ తేదిన కడపలో నిర్వహించే టీడీపీ ప్రజాగర్జనను విజయవంతం చేయాలని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ తెలిపారు. శుక్రవారం స్థానిక ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ ప్రజాగర్జనకు టీడీపీ అధినేత చంద్రబాబు  హాజరవుతారన్నారు. ఈ సందర్భంగా విలేకరులు పలు ప్రశ్నలు వేశారు. కాంగ్రెస్ వారంతా టీడీపీలో చేరుతున్నారు? టిక్కెట్లు, పదవులు తదితర సమస్యలు ఏమి ఉండవా? అని ఓ విలేకరి ప్రశ్నించగా, కాంగ్రెస్ పార్టీ క్లోజ్ అయిందని, వారంతా టీడీపీలోకి వస్తున్నారని,   సమస్యలేమీ లేవన్నారు.  ఈ సంద ర్భంగా ‘సాక్షి’పై అక్కసును ప్రదర్శించారు.


అక్రమాలు గురించి మాట్లాడుతుండగా.. ఓ విలేకరి ‘ఎర్రచందనం స్మగ్లర్ రెడ్డినారాయణను మీ పార్టీలో ఎలా చేర్చుకున్నారని’ ప్రశ్నించగా, అతను పార్టీకి సానుభూతి పరుడు మాత్రమేనంటూ దాట వేశారు. మరో ప్రశ్నకు సమాధానంగా కొన్ని  కారణాల వల్ల బీజేపీతో టీడీపీ పొత్తు కుదుర్చుకుందన్నారు.   ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి మాట్లాడుతూ  ఎన్నికలు టీడీపీకి అంతిమ పోరాటమన్నారు.

 పార్టీ ఈదఫా అధికారంలోకి రాలేక పోతే దేవుడు కూడా రక్షించలేడన్నారు. మాజీమంత్రి  ఖలీల్‌బాష, పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు అమీర్‌బాబు,   రాష్ట్ర నాయకులు గోవర్దన్‌రెడ్డి, సుబాన్‌బాష  తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement