కార్మికులపైకి దూసుకెళ్లిన లారీ: 8 మందికి గాయాలు | Lorry runs over labourers in prakasam district | Sakshi
Sakshi News home page

కార్మికులపైకి దూసుకెళ్లిన లారీ: 8 మందికి గాయాలు

Dec 21 2013 10:51 AM | Updated on Sep 2 2017 1:50 AM

జాతీయ రహదారిపై పనులు చేసుకుంటున్న కార్మికులపైకి లారీ దూసుకుపోయింది.

ప్రకాశం జిల్లా సింగరాయకొండ సమీపంలోని జాతీయ రహదారిపై పనులు చేసుకుంటున్న కార్మికులపైకి ఈ రోజు ఉదయం లారీ దూసుకెళ్లింది. ఆ ఘటనలో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి క్షతగాత్రులను హుటాహుటన ఒంగోలులోని రిమ్స్కు తరలించారు.

 

అయితే క్షతగాత్రుల్లో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్పై కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement