పశ్చిమగోదావరి జిల్లాలో దొంగల బీభత్సం | Lorry driver robbed and killed in West Godavari | Sakshi
Sakshi News home page

పశ్చిమగోదావరి జిల్లాలో దొంగల బీభత్సం

Aug 13 2014 8:43 AM | Updated on Aug 30 2018 5:27 PM

జీలుగుమిల్లి మండలం సమీపంలో ఓ డాబా వద్ద ఓ లారీ డ్రైవర్ను హతమార్చి నగదు, విలువైన వస్తువులు దోచుకెళ్లారు.

హైదరాబాద్: పశ్చిమగోదావరి జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. జీలుగుమిల్లి మండలం సమీపంలో ఓ డాబా వద్ద గుర్తుతెలియని దుండగులు లారీ డ్రైవర్, క్లీనర్పై దాడి చేశారు. ఈ ఘటనలో డ్రైవర్ మరణించగా, క్లీనర్ తీవ్రంగా గాయపడ్డాడు.

వీరిద్దరూ లారీ ఆపి నిద్రిస్తుండగా బుధవారం తెల్లవారుజాము ప్రాంతంలో దొంగలు దాడి చేసి 19 వేల రూపాయిల నగదు దోచుకెళ్లారు. డ్రైవర్, క్లీనర్ సమీప బంధువులు. వీరిని మహారాష్ట్రకు చెందినవారిగా గుర్తించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement