చివరి బంతి కొట్టాల్సింది నాయకులే: అశోక్బాబు | Leaders to bat Last Ball, says Ashok Babu | Sakshi
Sakshi News home page

చివరి బంతి కొట్టాల్సింది నాయకులే: అశోక్బాబు

Jan 13 2014 10:18 AM | Updated on Sep 2 2017 2:36 AM

చివరి బంతి కొట్టాల్సింది నాయకులే: అశోక్బాబు

చివరి బంతి కొట్టాల్సింది నాయకులే: అశోక్బాబు

రాష్ట్ర సమైక్యత విషయంలో కలికట్టుగా ఉంటామని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్బాబు అన్నారు.

గిద్దలూరు(ప్రకాశం జిల్లా): రాష్ట్ర సమైక్యత విషయంలో కలికట్టుగా ఉంటామని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్బాబు అన్నారు. తమ మధ్య ఎటువంటి విభేదాలు లేవని చెప్పారు. అందుకే తనపై పోటీ చేసిన బషీర్ సొంతూరులో భోగి మంటల్లో విభజన బిల్లు తగులబెట్టే కార్యక్రమంలో పాల్గొన్నానని తెలిపారు.

విభజనను అడ్డుకోవల్సిన బాధ్యత తమ కంటే ఎంపీ, ఎమ్మెల్యేలపైనే ఎక్కువ ఉందన్నారు. చివరి బంతి కొట్టాల్సిన బాధ్యత రాజకీయ నాయకులపై ఉందని చెప్పారు. ఈ బాధ్యతను గుర్తు చేయడానికే మరోసారి ఆందోళలు చేపట్టామన్నారు. చట్టసభల్లో విభజన బిల్లును అడ్డుకుంటామని నేతలు హామీయివ్వాల్సిన బాధ్యత నాయకులపై ఉందన్నారు. విభజనకు అనుకూలంగా వ్యవహరించిన నేతలకు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని అశోక్బాబు పిలుపిచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement