'సోనియా పదవిలో కొనసాగమంటేనే ....' | Kiran Kumar Reddy resigns as Andhra Pradesh Chief Minister, quits Congress | Sakshi
Sakshi News home page

'సోనియా పదవిలో కొనసాగమంటేనే ....'

Feb 19 2014 11:56 AM | Updated on Jul 29 2019 5:31 PM

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్న తర్వాత సోనియాగాంధీ ...ముఖ్యమంత్రి పదవిలో కొనసాగమంటేనే సీఎం పదవిలో ఉన్నానని కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్న తర్వాత సోనియాగాంధీ ...ముఖ్యమంత్రి పదవిలో కొనసాగమంటేనే సీఎం పదవిలో ఉన్నానని కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆయన బుధవారం ప్రెస్మీట్లో మాట్లాడారు. సీఎం ప్రెస్మీట్ వివరాలు

* సీట్లకోసం, అధికారకోసం తెలుగుజాతికి తీవ్ర నష్టం కలిగించారు
*విభజన వల్ల తెలుగు ప్రజలకు నష్టం కలుగుతుంది
*విభజన వల్ల ప్రజలకు లాభం కాకుండా నష్టం కలుగుతుంది
*58 సంవత్సరాలుగా ఇరు ప్రాంతాల వాళ్లు కలిసి ఉన్నారు
*ప్రతి సంవత్సరం ప్రజల మధ్య చిచ్చుపెట్టే అంశాలున్నాయి
*విభజన నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం

*విభజన నిర్ణయం తీసుకున్నప్పటినుంచీ ప్రతి అంశంలోనూ ఉల్లంఘనలు జరిగాయి
*పద్ధతి ప్రకారం విభజన జరగలేదు.. సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి
*టేబుల్‌ ఐటెంగా కేబినెట్‌ భేటీలో పెట్టారు
*కనీసం నోట్‌ను చదువుకునే అవకాశాన్ని కేబినెట్‌ మంత్రులకూ ఇవ్వలేదు
*జీవోఎం ఏర్పాటుతో పాటు చేసిన పద్ధతులన్నీ ఉల్లంఘనలే
*ఇదే బిల్లు పార్లమెంటులో పెడితే బుట్టదాఖలు అవుతుందని చెప్పాను
*లేకపోతే రాజకీయాలనుంచి తప్పుకుంటానని చెప్పాను

*అయితే దీనివల్ల రాజీనామా చేయడంలేదు
*డ్రాఫ్టు బిల్లుపై అసెంబ్లీ చర్చించడం ఎంతవరకు సమంజసం
*పార్లమెంటులో బిల్లు నడిపిన తీరుకూడా ఎంతవరకు సమంజసం?
*పార్లమెంటు సభ్యులను కొట్టించారు
*పార్లమెంటులో ప్రవర్తన దిగజారిపోయింది
*రాష్ట్ర సభ్యులు లేకుండా చేసి దొంగల మాదిరిగా వ్యవహరించారు

*ప్రత్యక్షప్రసారాలను ఎందుకు నిలిపేశారో దేశప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది
*అసెంబ్లీ తిరస్కరించిన బిల్లును తిరస్కరిస్తే.. అది సమాఖ్య స్ఫూర్తికి అగౌరవం కాదా?
*ప్రతిపక్ష బీజేపీ కూడా కుమ్మక్కైంది
*బీజేపీ చీకటి ఒప్పందాలను చేసుకుంది
*తెలుగువారి హృదయాలను గాయపరిచారు
*తెలుగుజాతిని నిలువునా చీలుస్తున్నారు

*ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా ఉంచడానికి కాంగ్రెస్‌...
అనేక సీడబ్ల్యూసీ, ఏఐసీసీ సమావేశాల్లోనిర్ణయించింది
*అలాంటి రాష్ట్రాన్ని విభజించడంతో దేశం బాగుపడుతుందా?
*ప్రజాస్వామ్యాన్ని హేళన చేశారు
*ప్రభుత్వం, ప్రతిపక్షం కలిసి కుమ్మక్కు చేశారు
*నా ఎదుగుదలకు, సీఎం పదవి ఇచ్చినందుకు కాంగ్రెస్‌కు కృతజ్ఞతలు
*కాని తెలుగువారి గుండెలను గాయపరిచినందుకు రాజీనామా
*సీఎం, ఎమ్మెల్యే పదవులతో సహా కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా
*ఫిబ్రవరిలో అసెంబ్లీ సమావేశాలకు 3రోజుల ముందే నాతో మాట్లాడారు
*సోనియాగాంధీ, నేను మాత్రమే మాట్లాడాం

*తెలంగాణపై నిర్ణయం తీసుకుందామా? అని అడిగారు
*బడ్జెట్‌ సెషన్స్‌ తర్వాత అంటే మార్చి 28 తర్వాత తీసుకోమని చెప్పాను
*ఆతర్వాత 50 సార్లు నిర్ణయం తీసుకోమన్నా తీసుకోలేదు
*సీడబ్ల్యూసీ తర్వాత రాజీనామా చేస్తానంటే కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఒప్పుకోలేదు
*తెలంగాణపై నిర్ణయం తీసుకున్న తర్వాత సోనియా పదవిలో కొనసాగమంటేనే కొనసాగాను

Advertisement
 
Advertisement
Advertisement